IND vs ENG: కంగారుపడాల్సిన అవసరం లేదు.. ఓవల్లో మనం గెలవొచ్చు! హిస్టరీ ఇదే
- తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 23 పరుగుల లీడ్
- ప్రస్తుతం 52 పరుగుల ఆధిక్యంలో భారత్
- కంగారుపడాల్సిన అవసరం లేదని హిస్టరీ చెబుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Historical Wins Show Hope for India in Oval: ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా లండన్లోని ఓవల్ క్రికెట్ గ్రౌండ్లో ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్లో భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్లో 23 పరుగుల లీడ్ సాధించిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్లో టీమిండియాపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రెండు వికెట్స్ తీసి విజయం సాధించాలని చూస్తోంది. ప్రస్తుతం భారత్ 52 పరుగుల ఆధిక్యంలో ఉన్నా.. మూడో రోజులో ఎన్ని పరుగులు చేస్తుందో అని ఫాన్స్ ఆందోళనలో ఉన్నారు. అయితే కంగారుపడాల్సిన అవసరం లేదని హిస్టరీ చెబుతోంది.
ఓవల్లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఇచ్చినా.. గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా భారత్ కూడా రెండుసార్లు ఆతిథ్య ఇంగ్లండ్పై గెలుపొందింది. 1971లో భారత్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 71 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్లో 101 పరుగులకే ఆలౌట్ అయిటీమిండియాకు 173 పరుగుల టార్గెట్ను విధించింది. లక్ష్యాన్ని భారత్ ఆరు వికెట్లను కోల్పోయి విజయం సాధించింది. 2021లో తొలి ఇన్నింగ్స్లో భారత్ 191 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 290 పరుగులు చేసి 99 పరుగుల లీడ్ సాధించింది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 466 పరుగులు చేసి.. 368 పరుగుల లక్ష్యంను విధించింది. ఇంగ్లీష్ జట్టు 210 పరుగులకే ఆలౌట్ అయి ఓడిపోయింది.
Also Read
- Ind vs Eng Playing XI: తప్పక గెలవాల్సిందే.! నేడు భారత్, ఇంగ్లాండ్ నాల్గవ టీ20.. ప్లేయింగ్ XI ఇదే..
- Pawan Kalyan: నేడు జనసేన కీలక సమావేశం.. నేతలకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
- Astrology: జూలై 9 గురువారం దినఫలాలు.. మీది ఈ రాశియా? అయితే జాగ్రత్త..
- Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
ప్రస్తుత సిరీస్లో ఐదవ టెస్ట్ మ్యాచ్లో భారత్ రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించింది. రెండో రోజు ఆట ముగిసేసరికి 75/2 స్కోర్ చేసింది. ప్రస్తుతం భారత్ 52 పరుగులు ఆధిక్యంలో ఉంది. యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ సాధించి క్రీజులో ఉన్నాడు. ఇంకా గిల్, నాయర్, జడేజా, జురెల్, సుందర్ బ్యాటింగ్ చేయాల్సి ఉంది. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో భారత్ ఈరోజు మొత్తం బ్యాటింగ్ చేస్తే భారీ లీడ్ సాధించొచ్చు. ఇంగ్లండ్ ఎదుట కనీసం 350 ప్లస్ టార్గెట్ ఉంచితే భారత్ గెలవడం పెద్ద కష్టమేం కాదు. రెండో రోజు భారత్ ప్రదర్శనపైనే ఫలితం ఆధారపడి ఉంది.
తాజావార్తలు
-
Ind vs Eng Playing XI: తప్పక గెలవాల్సిందే.! నేడు భారత్, ఇంగ్లాండ్ నాల్గవ టీ20.. ప్లేయింగ్ XI ఇదే..
-
Suman: రీల్ హీరో కాదు.. రియల్ హీరో! సైనికుల కోసం సుమన్ చేసిన గొప్ప త్యాగం ఏమిటో తెలుసా?
-
Rishab Shetty : రిషబ్ శెట్టిని ఆ నిర్మాణ సంస్థ మోసం చేసిందా?
-
Pawan Kalyan: నేడు జనసేన కీలక సమావేశం.. నేతలకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
-
Donald Trump: ఇరాన్ నన్నే మొదట చంపాలనుకుంటోంది.. టర్కీలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..