IND vs ENG: 60-70 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదిస్తాం.. జేమ్స్ అండర్సన్ షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Even if India got 600 England will chase Says James Anderson: భారత్ నిర్ధేశించిన 399 పరుగుల లక్ష్యాన్ని 60-70 ఓవర్లలో ఛేదించే ప్రయత్నం చేస్తామని ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ తెలిపాడు. భారత్ 600 స్కోరు చేసినా ఛేజింగ్ చేయాల్సిందే అని కోచ్ బ్రెండన్ మెకల్లమ్ చెప్పాడన్నాడు. భారత్ నిర్దేశించిన 399 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ మూడో రోజు ముగిసే సమయానికి 1 వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. మిగిలిన 2 రోజుల్లో ఇంగ్లండ్ విజయానికి ఇంకా 332 పరుగులు చేయాల్సి ఉంది.
మూడో రోజు ఆట ముగిసిన అనంతరం ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ మాట్లాడుతూ… ‘గత రాత్రి సమావేశం జరిగింది. భారత్ ఎంత పెద్ద స్కోరు చేసినా ఛేజింగ్ చేయాల్సిందేనని అని మా కోచ్ బ్రెండన్ మెకల్లమ్ చెప్పాడు. రెండో ఇన్నింగ్స్లో భారత్ 600 పరుగులు చేసినా.. దాన్ని ఛేజ్ చేసేందుకు ప్రయత్నించాలన్నాడు. మూడో రోజు భారత్ మంచి స్కోరు సాధించింది. ఆటలో ఇంకా 180 ఓవర్లు మిగిలి ఉన్నాయని నాకు తెలుసు. కానీ మేము 60-70లో లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తాము. మేము ఆ విధంగానే ఆడతాము’ అని చెప్పాడు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
Also Read: Virat Kohli: అభిమానులకు బ్యాడ్ న్యూస్.. మూడో టెస్టుకు విరాట్ కోహ్లీ దూరం!
‘రెహాన్ అహ్మద్ మంచి షాట్స్ ఆడాడు. రేపు కూడా బాగా ఆడాలని చూస్తున్నాడు. నాలుగో రోజు మా ఆట భిన్నంగా ఏమీ ఉండదు. గత రెండు సంవత్సరాలుగా మేము ఆడుతున్న విధంగానే ఆడతాము. మేము గెలిచినా, ఓడినా దూకుడుగానే ఆడుతాం. మేము ఆడే ప్రతి గేమ్ను గెలవాలనుకుంటున్నాము. అయితే మేము ఓ నిర్దిష్ట మార్గంలో ఆడాలనుకుంటున్నాము’ అని జేమ్స్ అండర్సన్ తెలిపాడు. సోమవారం ఆట ఆరంభం కాగా.. నాలుగు వికెట్స్ కోల్పోయి 154 రన్స్ చేసింది. విజయానికి ఇంకా 245 రన్స్ కావాలి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!