Vizag Test: విశాఖ టెస్టు.. తెలుగు ఆటగాడిని సన్మానించనున్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ACC Plans to felicitated KS Bharat in IND vs ENG 2nd Test: ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా వైజాగ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్ చేజార్చుకున్న రోహిత్ సేన.. వైజాగ్ టెస్టులో పుంజుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం భారత క్రికెటర్లు విశాఖ మైదానంలో ప్రాక్టీస్లో బిజీ అయ్యారు. రెండో టెస్టు కోసం రెండు రోజుల కిందటే విశాఖపట్నంకు చేరుకున్న టీమిండియా క్రికెటర్లు బుధవారం స్టేడియంలో చెమటోడ్చారు. టీమిండియా కీపర్, ఆంధ్ర కెప్టెన్ కేఎస్ భరత్ తన హోం గ్రౌండ్లో తొలి టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు.
సొంత గడ్డపై తొలి మ్యాచ్ ఆడుతున్న కేఎస్ భరత్ను ఘనంగా సన్మానించాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నిర్ణయించుకుంది. ‘విశాఖ నుంచి అంతర్జాతీయ క్రికెటర్గా ఎదిగిన శ్రీకర్ భరత్ను రెండో టెస్ట్ సందర్భంగా ఘనంగా సన్మానిస్తాం. ఈ కార్యక్రమంను గురువారం స్టేడియంలో ఏర్పాటు చేశాం. ఇది భరత్ విజయానికి దగ్గిన గౌరవం’అని ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి తెలిపారు. భరత్ క్రికెట్ ప్రయాణం వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలోనే ప్రారంభమైంది. 2005లోబాల్ బాయ్గా ఉన్న అతడు.. అదే మైదానంలో ఇప్పుడు అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు.
Also Read
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
Also Read: Jack Leach Injury: వైజాగ్ టెస్టుకు ముందు భారత్కు శుభవార్త.. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ ఔట్!
సొంతగడ్డపై టెస్టులో ఆడనున్న రెండో ఆంధ్ర ఆటగాడిగా కేఎస్ భరత్ నిలవనున్నాడు. భరత్ కంటే ముందు ఆంధ్ర ప్లేయర్ సీకే నాయుడు సొంతగడ్డపై ఆడాడు. ఎమ్మెస్కె ప్రసాద్, వేణు గోపాల్ రావు, హనుమ విహారి భారత్ తరపున టెస్టుల్లో ఆడినప్పటికీ.. సొంతగడ్డపై ఆడే ఛాన్స్ రాలేదు. ఇక వీవీఎస్ లక్షణ్ హైదరాబాద్ ప్లేయర్ అన్న విషయం తెలిసిందే. భరత్ ఇప్పటివరకు 6 టెస్టులు ఆడి 198 పరుగులు చేశాడు.
తాజావార్తలు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!