Rishabh Pant: 632 రోజుల తర్వాత.. టీమిండియాకు ఆడబోతున్న పంత్!
- భారత్-బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ ప్రారంభం
- ఆరు నెలల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడబోతోన్న భారత్
- 632 రోజుల తర్వాత టెస్టు క్రికెట్లోకి పంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant Set To Play Test Cricket: మరికొద్ది గంటల్లో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టుకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదిక. ఆరు నెలల తర్వాత టీమిండియా టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. మరోవైపు భారత జట్టు రెగ్యులర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 632 రోజుల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. ఇంత విరామం ఫామ్ లేమి వల్లనో లేదా గాయం వల్లోనో వచ్చింది కాదన్న విషయం తెలిసిందే.
2022 డిసెంబర్ 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. నూతన సంవత్సర వేడుకల కోసం న్యూఢిల్లీ నుండి స్వగ్రామం రూర్కీకి వెళుతుండగా.. పంత్ ప్రయాణిస్తున్న కారు ఓవర్ స్పీడ్ కారణంగా డివైడర్ను ఢీకొట్టింది. పల్టీలు కొట్టిన కారులో అకస్మాత్తుగా మంటలు కూడా చెలరేగాయి. అటుగా వెళుతున్న ఓ వ్యక్తి.. కారు అద్దం పగలగొట్టి పంత్ను బయటికి తీసి ఆస్పత్రికి తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. గాయాల నుంచి పంత్ పూర్తిగా కోలుకుని పోటీ క్రికెట్ ఆడడానికి 15 నెలలు పట్టింది.
Also Read
- Mamata Banerjee: ఉంటే.. ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి.. జంపింగ్లకు మమత సందేశం
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
- CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్.. ఎవరికి ఏ శాఖ?
- CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
Also Read: Rohit Sharma: యూటర్న్ తీసుకోవడం ఓ జోక్గా మారింది.. క్రికెటర్లపై మండిపడిన రోహిత్!
ఐపీఎల్ 2024తో రిషబ్ పంత్ పునరామనం చేశాడు. 16వ సీజన్లో కొన్ని మంచి ఇన్నింగ్స్లతో ఆకట్టుకున్నాడు. దాంతో టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపికయ్యాడు. మెగా టోర్నీలోనూ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసి కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. ఆపై శ్రీలంక పర్యటనలో టీ20లు, వన్డేలు ఆడాడు. ఎట్టకేలకు ఇప్పుడు టెస్టు క్రికెట్లోకి పంత్ పునరామగనం చేస్తున్నాడు. చివరగా అతను టెస్టు మ్యాచ్ ఆడింది బంగ్లాదేశ్తోనే కావడం విశేషం. జట్టులోకి పంత్ రావడంతో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ధ్రువ్ జురెల్కు నిరాశ తప్పదు.
తాజావార్తలు
-
Mamata Banerjee: ఉంటే.. ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి.. జంపింగ్లకు మమత సందేశం
-
Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
-
Peddi First Review: 3 గంటల ఊర మాస్ జాతర.. సినిమాలో అదే అసలు హైలైట్
-
CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్.. ఎవరికి ఏ శాఖ?
-
Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..