IND vs BAN: భారత్-బంగ్లా షెడ్యూల్లో మార్పు.. 14 ఏళ్ల తర్వాత అక్కడ అంతర్జాతీయ మ్యాచ్!
- బంగ్లా షెడ్యూల్లో మార్పు
- గ్వాలియర్లో టీ20 మ్యాచ్
- వన్డేల్లో సచిన్ డబుల్ సెంచరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs BAN 1st T20I shifted from Dharamsala to Gwalior: బంగ్లాదేశ్, ఇంగ్లండ్లతో జరగబోయే స్వదేశీ సిరీస్ల షెడ్యూల్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం మార్పులు చేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం.. బంగ్లాదేశ్తో ఓ టీ20, ఇంగ్లండ్తో రెండు టీ20 మ్యాచ్ల వేదికలు మారాయి. బంగ్లాదేశ్తో త్వరలో జరగబోయే టీ20 సిరీస్లోని తొలి మ్యాచ్ గ్వాలియర్ మైదానంలో జరగనుంది. అక్టోబర్ 6న తొలి టి20 ధర్మశాలలో జరగాల్సి ఉండగా.. అక్కడ నవీకరణ పనులు సమయానికి పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో వేదికను బీసీసీఐ మార్చింది.
2010 తర్వాత తొలిసారిగా గ్వాలియర్ మైదానం ఓ అంతర్జాతీయ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది. 2010లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఈ మైదానంలోనే వన్డేల్లో డబుల్ సెంచరీ చేశాడు. గ్వాలియర్ నగరంలో ‘శ్రీమంత్ మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియం’ను కొత్తగా నిర్మించిన విషయం తెలిసిందే. 14 ఏళ్ల తర్వాత గ్వాలియర్లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది. ఈ విషయం తెలిసిన నగర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
Also Read: Ticket Price: అభిమానులకు బంపర్ ఆఫర్.. టికెట్ ధర కేవలం 15 రూపాయలే!
మరోవైపు వచ్చే ఏడాది జనవరిలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన టీ20 మ్యాచ్ల వేదికలు కూడా మారాయి. చెన్నై, కోల్కతాల్లో జరగాల్సిన మ్యాచ్ వేదికల్ని బీసీసీఐ పరస్పరం మార్చింది. జనవరి 22న చెన్నైలో జరగాల్సిన మొదటి టీ20ని కోల్కతాలో, 25న కోల్కతాలో జరగాల్సిన రెండో మ్యాచ్ చెన్నైలో జరగనుంది. గణతంత్ర దినోత్సవం కారణంగా తేదీని మార్చాలని కోల్కతా పోలీసులు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ను అభ్యర్థించడంతో బీసీసీఐ షెడ్యూల్లో మార్పులు చేసింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!