Love Marriage : బిడ్డ టీచరు.. తండ్రి ప్రొఫెసర్.. పరువు పోతుందని అంత పని చేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Love Marriage : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కూతురి ప్రేమను ఒప్పుకోలేని తండ్రి ఆమెను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కూతరు ప్రేమ పెళ్లి విషయంలో తండ్రితో గొడవ పెట్టుకుంది. తనకు నచ్చినవాడినే చేసుకుంటానని ఆ అమ్మాయి పట్టుబట్టింది. దీనికి తండ్రి వ్యతిరేకించాడు. కానీ ఆ అమ్మాయి సరేమీరా అంది. వారిద్దరి మధ్య వాదన తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన తండ్రి లైసెన్స్ ఉన్న తుపాకీతో బాలికపై కాల్పులు జరిపాడు. దీంతో ఆమె చనిపోయింది. కొద్దిసేపటి తర్వాత అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. కూతురిని చంపిన తర్వాత తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కస్గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలు పాఠశాలలో ఉపాధ్యాయురాలి పనిచేస్తుండగా, తండ్రి కళాశాలలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా ఉన్నారు.
Read Also: Drugs Price : ఫార్మా కంపెనీల ‘మందు’పాతర.. ఏప్రిల్ 1న విడుదల
Also Read
- Nepal Gorkhas: "మేము భారత సైన్యంలో చేరుతాం".. నేపాల్లో రోడ్డెక్కిన యువత
- CM Chandrababu: డీఎస్సీపై కౌంటర్ ఎటాక్.. మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
- 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
- August 14 1947 అర్ధ రాత్రి ఏం జరిగింది?.. స్వాతంత్య్ర సంబరాల వెనుక దాగిన విభజన విషాదం..
మైన్పురి జిల్లాకు చెందిన నరేంద్ర సింగ్ యాదవ్ కాస్గంజ్లోని ఓ కళాశాలలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. కాగా బాలిక మీర్జాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఆ అమ్మాయి తనకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ తండ్రి అందుకు అంగీకరించలేదు. తండ్రి అమ్మాయికి చాలా నచ్చజెప్పాడు, కానీ ఆమె ప్రేమ మైకంలో వినలేదు. పైగా ‘నేను చదువుకున్నాను, నా కాళ్లపై నేను నిలబడతాను, నేనే నిర్ణయాలు తీసుకోగలను’ అని తన తండ్రికి చెప్పడంతో తండ్రి ఆగ్రహానికి గురయ్యాడు.
Read Also: IRCTC : వాట్సాప్ ద్వారా PNR, రైలు స్థితిని ఎలా చెక్ చేయాలంటే..
కోపంలో తండ్రి గదిలోకి వెళ్లి లైసెన్స్ ఉన్న తుపాకీని తీసుకొచ్చాడు. దీంతో బాలికపై తుపాకీ గురిపెట్టి కాల్చేసి.. పారిపోయి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. రక్తపు మడుగులో పడి ఉన్న భర్త, కుమార్తెను చూసి భార్య కేకలు వేయడం ప్రారంభించింది. మహిళ గొంతు విని ఇరుగుపొరుగు వారు పరుగున వచ్చారు. ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. పరువు పోతుందనే భయంతో తండ్రి చేసిన పనితో కుటుంబంలో విషాదం నెలకొంది.
తాజావార్తలు
-
Nepal Gorkhas: “మేము భారత సైన్యంలో చేరుతాం”.. నేపాల్లో రోడ్డెక్కిన యువత
-
AI Jobs Impact: AI ప్రభావం.. 9.2 కోట్ల ఉద్యోగాలు మాయం.. కానీ, 17 కోట్ల కొత్త ఉద్యోగ అవకాశాలు
-
CM Chandrababu: డీఎస్సీపై కౌంటర్ ఎటాక్.. మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Independence Day 2026: మౌల్వీ మహమ్మద్ బాఖిర్… బ్రిటిష్ని గడగడలాడించిన జర్నలిస్ట్!
ట్రెండింగ్
-
కొత్త ‘ఆలివ్ మాట్రిక్స్ డిస్ప్లే’తో.. ఆగస్టు 18న POVA 8 Pro లాంచ్..!
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మనీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!