Ranji Trophy: 20 పరుగుల వ్యవధిలో 10 మంది బ్యాట్స్మెన్స్ ఔట్..
- భారత్లో ప్రస్తుతం రంజీ ట్రోఫీ సీజన్ కొనసాగుతోంది.
- ఎలైట్ గ్రూప్-ఎలో జరిగిన మేఘాలయ - జమ్మూ కాశ్మీర్ మ్యాచ్లో.
- 20 పరుగుల వ్యవధిలో 10 మంది బ్యాట్స్మెన్స్ ఔట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranji Trophy Meghalaya vs JK: భారత్లో ప్రస్తుతం రంజీ ట్రోఫీ సీజన్ కొనసాగుతోంది. ఎలైట్ గ్రూప్-ఎలో జరిగిన మేఘాలయ, జమ్మూ కాశ్మీర్ మ్యాచ్లో 10 మంది బ్యాట్స్మెన్స్ 20 పరుగుల వ్యవధిలో ఔట్ అయ్యి పెవిలియన్కు చేరుకున్న సంఘటన చోటు చేసుకుంది. ఇందులో ఐదుగురు బ్యాట్స్మెన్స్ ఖాతా కూడా తెరవలేదు. ఈ ఇన్నింగ్స్ లో మొత్తం 9 మంది బ్యాట్స్మెన్ రెండంకెల స్కోరును కూడా అందుకోలేకపోయారు. దింతో మేఘాలయ మొదటి ఇన్నింగ్స్లో 73 పరుగులకు ఆలౌట్ అయింది.
Read Also: Border Gavaskar Trophy: ఆమె కాళ్లు మొక్కి ఫ్లైట్ ఎక్కిన పంత్.. వీడియో వైరల్!
Also Read
- YS Jagan: పరీక్ష లేకుండానే 372 ఉద్యోగాలు.. ఆ తర్వాత జీవోలు ఎందుకు మార్చారు?
- YS Jagan: డీఎస్సీలో తవ్వేకొద్దీ అక్రమాలు.. అది అంటేనే చంద్రబాబుకు బీపీ పెరిగిపోతుంది..!
- Lucknow: ఏడాది క్రితమే పెళ్లి.. ఇప్పుడు భార్యకు ప్రియుడితో మరో పెళ్లి.!
- Modi-Xi Jinping Meeting: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారి భారత్కు జిన్పింగ్.. మోడీ-చైనా అధ్యక్షుడి భేటీపై ఉత్కంఠ
ఈ మ్యాచ్లో, మేఘాలయ జట్టు మొదట బ్యాటింగ్కు చేపట్టింది. ఓపెనర్లు బమన్భా షాంగ్ప్లియాంగ్, అర్పిత్ భతేవారా జట్టుకు శుభారంభం అందించి తొలి వికెట్కు 53 పరుగులు జోడించారు. ఈ స్కోరుపై బమన్భ (21) రూపంలో జట్టుకు తొలి వికెట్ కోల్పోయింది. అతని తర్వాత అర్పిత్ (24) కూడా పెవిలియన్ చేరాడు. ఇక్కడి నుంచి మేఘాలయ ఇన్నింగ్స్ తడబడడంతో జట్టు మొత్తం 73 పరుగులకే కుప్పకూలింది. దింతో మేఘాలయకు మొదటి వికెట్ కోల్పోయినప్పుడు స్కోరు 53 పరుగులు. ఆ తర్వాత 20 పరుగులు చేసేసరికి జట్టులోని 10 మంది బ్యాట్స్మెన్లు పెవిలియన్కు చేరుకున్నారు. మేఘాలయకు చెందిన 5 మంది బ్యాట్స్మెన్ ఖాతా కూడా తెరవలేదు. ఐకమరోవైపు జమ్ముకశ్మీర్కు చెందిన ఔకిబ్ నబీ, అబిద్ ముస్తాక్ చెరో 5 వికెట్లు తీశారు.
Read Also: US Elections: ఆ ఒక్క రాష్ట్రం మినహా భారతదేశం మొత్తం ట్రంప్ గురించి గూగుల్లో సెర్చ్
మేఘాలయ బ్యాటింగ్ కుప్పకూలిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ఇన్నింగ్స్ కూడా తడబడినట్లు కనిపించింది. సాహిల్ లోత్రా (16 పరుగులు*), అబిద్ ముస్తాక్ (4 పరుగులు*) నాటౌట్గా ఉండగా.. ఓపెనింగ్లో శుభమ్ ఖజురియా (19), అహ్మద్ బండే (24) పగులకే ఔటయ్యారు. వివరాల్ శర్మ ఖాతా తెరవలేకపోయాడు. కాగా, అబ్దుల్ సమద్ 34 పరుగుల ఇన్నింగ్స్ ఆడి పెవిలియన్కు చేరుకున్నాడు. పరాస్ డోగ్రా 12, శివాంశ్ శర్మ 9 పరుగులు చేశారు. మొత్తానికి మొదటి రోజు ముగిసే సమయానికి జమ్మూ కాశ్మీర్ మొదటి ఇన్నింగ్స్ లో 6 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది.
తాజావార్తలు
-
CM Vijay vs MK Stalin: ‘అసెంబ్లీని రీల్స్ చేసే వేదికగా మార్చొద్దు’.. సీఎం విజయ్పై స్టాలిన్ విమర్శలు
-
YS Jagan: పరీక్ష లేకుండానే 372 ఉద్యోగాలు.. ఆ తర్వాత జీవోలు ఎందుకు మార్చారు?
-
Kashmiri Pandits: టార్గెట్ కాశ్మీరీ పండిట్స్..ఉద్యోగాలు మానకపోతే చం*పేస్తాం!
-
YS Jagan: డీఎస్సీలో తవ్వేకొద్దీ అక్రమాలు.. అది అంటేనే చంద్రబాబుకు బీపీ పెరిగిపోతుంది..!
-
Lucknow: ఏడాది క్రితమే పెళ్లి.. ఇప్పుడు భార్యకు ప్రియుడితో మరో పెళ్లి.!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?