Rajayasabha: నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) అభిమానులకు గుడ్ న్యూస్. తాజాగా జరిగిన ఉప ఎన్నికల నేపథ్యంలో రాజ్యసభలో ఎన్డీయే కూటమికి మెజారిటీ మార్క్ లభించింది. ఈ మెజారితో పార్లమెంటు ఎగువ సభలో ఏవైనా బిల్లులను ఆమోదం పొందేందుకు ఎన్డీయే ప్రభుత్వానికి మార్గం మరింత సుగమం కానుంది. ఇకపోతే, ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో 12 రాజ్యసభ స్థానాలకు జరిగిన పోటీలో అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక ఈ 12 స్థానాలకు గాను కేవలం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) అభ్యర్థులే 11 స్థానాల్లో విజయం సాధించారు. ఒక్క స్థానంలో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ లెక్కలతో ఎగువసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మెజారిటీ స్థానాల మార్కును అధిగమించింది. ఇకపోతే ఎన్డీయేకు రాజ్యసభలో మెజారిటీ రావడం చరిత్రలో ఇదే మొదటిసారి.
ఇకపోతే రాజ్యసభలో కొత్తగా చేరిన 12 మంది సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి..
బీజేపీ అభ్యర్థులు:
* అస్సాం నుంచి మిషన్ రంజన్ దాస్, రామేశ్వర్ తేలీ.
* బీహార్ నుంచి మనన్ కుమార్ మిశ్రా.
* హర్యానా నుంచి కిరణ్ చౌదరి.
* మధ్యప్రదేశ్ నుంచి జార్జ్ కురియన్.
* మహారాష్ట్ర నుంచి ధైర్యషీల్ పాటిల్.
* ఒడిశా నుంచి మమతా మొహంతా.
* రాజస్థాన్ నుంచి రవ్నీత్ సింగ్ బిట్టు.
* త్రిపుర నుంచి రాజీవ్ భట్టాచార్జీ.
* మహారాష్ట్ర నుంచి బీజేపీ మిత్రపక్షాల నితిన్ పాటిల్,
* బీహార్ నుంచి ఉపేంద్ర కుష్వాహ విజయం సాధించారు.
* తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ విజయం సాధించారు.
