Crime: మంచిగా మాంసం కూర వండారు.. తల్లికి విషం పెట్టి చంపారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: రానురాను మానవ సంబంధాలు దారుణంగా తయారవుతున్నాయి. మనీ మానవ బంధాలను మార్చేస్తోంది. డబ్బు వ్యామోహంలో పడి మనిషి క్రూరంగా మారిపోతున్నాడు. డబ్బులకోసం కుటుంబ సభ్యులనే కాటికి చేర్చుతున్న ఘటనలు కోకొల్లలు. తాజాగా ఇలాంటి ఘటనే.. ముజఫర్ నగర్లో చోటు చేసుకుంది. అను కుమారి (30) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసు అహియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శ్ విలేజ్ రోడ్ నంబర్ 1కి సంబంధించినది. ఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు అను కుమారికి భర్త సూచనల మేరకే ఆమె సవతి కుమారులు విషమిచ్చి చంపారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న అనూ కుమారి పేరెంట్స్ అహియాపూర్ పోలీస్ స్టేషన్ పోలీసులకు సమాచారం అందించారు.
Read Also: Rs.425crore worth Drugs seized : ఇరాన్ బోటు నుంచి రూ.425కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
Also Read
- Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
అనూ కుమారి స్పృహతప్పి పడిపోయింది. స్థానికులు ఆమెను జురాన్ ఛప్రాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ కేసులో వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు బ్రహ్మపుర పోలీసులు తెలిపారు. అల్లుడు ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాడని మృతుడి తల్లి రీటా దేవి తెలిపారు. ప్రస్తుతం శివహర్లోని డయల్ 112లో పని చేస్తున్నారు. అల్లుడి మొదటి భార్య చనిపోయింది. ఆమెకు కూడా విషం ఇచ్చి హత్య చేసినట్లు ఆరోపించింది. ఐదేళ్ల క్రితం అను రెండో పెళ్లి చేసుకుంది. పెళ్లి సమయంలో రూ.3 లక్షల విలువైన నగలు, ఫర్నీచర్ వస్తువులు ఇచ్చినట్లు చెప్పింది. ఆ తర్వాత కూతురిని కూడా మరిన్ని డబ్బులు తేవాలని హింసించేవాడని పేర్కొంది.

Read Also:Gay Partner : వ్యాపారి.. పార్టనర్.. మధ్య కుదరని ఆ సంబంధం.. సుత్తితో కొట్టి దారుణంగా..
రీటా దేవి అల్లుడికి మొదటి భార్య ద్వారా ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరూ మైనర్లే. అందరూ కలిసి తన కూతురిని హింసించే వారని చెప్పుకొచ్చింది. రాత్రి కొడుకులిద్దరూ మాంసం చేసి అనూకు తినిపించారు. తరువాత, ఆమె స్నానం చేయడానికి వెళ్లింది. కొంతసేపటికి స్థానికులు ఫోన్ చేసి అను స్పృహ తప్పి పడిపోయిందని చెప్పారు. హాస్పిటల్ కి తీసుకెళ్లారు. నిందితుడు తండ్రి ఆదేశానుసారం సవతి కొడుకులిద్దరూ తన ఆహారంలో విషం కలిపారని రీటా దేవి తెలిపారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతికి గల కారణాలు తెలియనున్నాయి.
తాజావార్తలు
-
Nasser Hussain: బెన్ స్టోక్స్.. నువ్ చేసింది తప్పే, కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకోవద్దు!
-
Opendoor India Exit: భారత్కు గుడ్బై చెప్పిన ఓపెన్డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
-
Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!