Kolkata Doctor Murder Case: ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసులో మరో 6 మందికి పాలిగ్రఫీ పరీక్షలు..
- మహిళా ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో మొత్తం ఏడుగురికి పాలీగ్రాఫ్ పరీక్ష.
- కోల్కతా లోని సీబీఐ కార్యాలయంలో నిందితుడు సంజయ్ రాయ్
- ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్
- ఘటన జరిగిన రాత్రి బాధితురాలితోపాటు నలుగురు వైద్యులను.
- ఒక వాలంటీర్ లకు పాలిగ్రాఫ్ పరీక్షలు చేపడుతున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Doctor Murder Case: ఆర్జి కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మహిళా ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో మొత్తం ఏడుగురికి పాలీగ్రాఫ్ పరీక్ష ప్రారంభమైంది. కోల్కతా లోని సీబీఐ కార్యాలయంలో నిందితుడు సంజయ్ రాయ్, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్, ఘటన జరిగిన రాత్రి బాధితురాలితోపాటు నలుగురు వైద్యులను.. అలాగే, ఒక వాలంటీర్ లకు పాలిగ్రాఫ్ పరీక్షలు చేపడుతున్నారు. ఇకపోతే నిందితులు నిజాన్ని బయటపెట్టడానికి, పోలీసులు పాలిగ్రాఫ్ పరీక్షను నిర్వహిస్తారు. దీనిలో లై డిటెక్టర్ యంత్రం ద్వారా అబద్ధాలను గుర్తించే ప్రయత్నం చేస్తారు. ఇందులో నిందితుడి సమాధానం సమయంలో శరీరంలో సంభవించే మార్పుల ద్వారా, నిందితుడు ప్రశ్నకు సరిగ్గా సమాధానం ఇస్తున్నాడా లేదా అనేది నిర్ధారించబడుతుంది. ఈ పరీక్షలో నిందితుల శారీరక మార్పులని జాగ్రత్తగా స్టడీ చేసి, వారి ప్రతిచర్యను బట్టి సమాధానం నిజమో.. అబద్ధమో.. నిర్ణయించబడుతుంది.
Cyber Frauds: బీ అలర్ట్.. ఇన్వెస్ట్మెంట్ పేరుతో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు..
Also Read
- Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
- US-India-Russia: చమురు విషయంలో రష్యా హామీ.. అమెరికా ముందు భారత్ కీలక డిమాండ్..
- Monsoon Alert: భారతీయులకు శుభవార్త.. 5 రోజుల ముందే అండమాన్ను తాకనున్న తొలకరి జల్లు
- AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
ఇది అనేక భాగాలను కలిగి ఉండే యంత్రం. ఇందులో నిందితుడి శరీరానికి కొన్ని యూనిట్లు అతికిస్తారు. ఉదాహరణకు, యంత్ర యూనిట్లు వేళ్లు, తల, నోటిపై ఉంచబడతాయి. నిందితుడు సమాధానమిచ్చినప్పుడు, ఈ యూనిట్ల నుండి డేటా స్వీకరించబడుతుంది. ఇది ప్రధాన యంత్రానికి చేరడం ద్వారా అబద్ధం లేదా నిజామా అని గుర్తిస్తుంది. శరీరానికి అనుసంధానించబడిన యూనిట్లలో న్యుమోగ్రాఫ్, కార్డియోవాస్కులర్ రికార్డర్, గాల్వనోమీటర్ ఉన్నాయి. అలాగే చేతులకు పల్స్ కఫ్స్ కట్టుకుని, వేళ్లకు లోంబ్రోసో గ్లౌజులు వేసుకుంటారు. దీనితో పాటు రక్తపోటు, పల్స్ రేటు తదితరాలను కూడా యంత్రం ద్వారా పరిశీలిస్తారు. పల్స్ రేటు, శ్వాస మొదలైనవి శరీరంపై ఉంచే పరికరంలో న్యూమోగ్రాఫ్ ద్వారా పర్యవేక్షించబడతాయి. సమాధానం సమయంలో, అబద్ధం లేదా నిజం శ్వాస ద్వారా నిర్ణయించబడతాయి. ఇక హృదయ స్పందన, రక్తపోటు కార్డియోవాస్కులర్ రికార్డర్ తో పర్యవేక్షించబడతాయి. ఎందుకంటే, అబద్ధం చెప్పేటప్పుడు దానిలో అసాధారణ మార్పులు సంభవిస్తాయి. దీని ద్వారా నిజమో లేదో గుర్తించవచ్చు.
తాజావార్తలు
-
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
-
Adani Group: అదానీ వేల కోట్ల సామ్రాజ్యంలోకి మరొక కంపెనీ.. ఇకపై జీవీకే ఎనర్జీ అదానీ సొంతం!
-
US-India-Russia: చమురు విషయంలో రష్యా హామీ.. అమెరికా ముందు భారత్ కీలక డిమాండ్..
-
Monsoon Alert: భారతీయులకు శుభవార్త.. 5 రోజుల ముందే అండమాన్ను తాకనున్న తొలకరి జల్లు
-
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?