IPL 2025: గిల్ vs అయ్యర్.. క్రేజీ పోటీ మాములుగా లేదుగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2025: తొలి సీజన్లోనే ఛాంపియన్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ గతేడాది లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. కానీ, ఈ సీజన్ లో మాత్రం ఆ జట్టు అసాధార ప్రదర్శనతో అదరగొడుతుంది. శుభ్ మన్ గిల్ నేతృత్వంలో గుజరాత్ టైటాన్స్ సమిష్టిగా రాణిస్తూ ప్లేఆప్స్ రేసులో నిలిచింది. ఈ సీజన్ లో ఇప్పటివరకు 9 మ్యాచుల్లో ఆరు గెలిచి 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. గుజరాత్ ను సక్సెస్ ఫుల్ గా నడిపించడంలో కెప్టెన్ గిల్ విజయం సాధించాడు. ఈ సీజన్లో అద్భుత ఫామ్ తో రాణించిన గిల్.. రెండు భారీ ఇన్నింగ్స్ ఆడాడు. తాజాగా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ పై 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేయగా.. అంతకుముందు మ్యాచ్ లో కేకేఆర్ పై 10 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో 90 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ రెండు ఇన్నింగ్స్ లో సెంచరీ చేరువలో అవుటైన గిల్ ఈ ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన నంబర్ వన్ కెప్టెన్ గా నిలిచాడు. ఈ సీజన్ లో మొత్తంగా 9 మ్యాచ్ల్లో 156 స్ట్రైక్ రేట్ తో 389 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలు నమోదయ్యాయి.
Also Read
- Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
- KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
- Natural Home Cooling Tips: కూలర్, ఏసీ లేకుండానే కూల్ కూల్గా ఇల్లు.. ! మన తాతముత్తాతలు ఉపయోగించిన చిట్కాలు ఇవే..!
- Roti Calories: గోధుమ నుంచి రాగి వరకు.. ఆరోగ్యానికి ఏ రొట్టె బెస్ట్..? ఏ రొట్టెలో ఎన్ని కేలరీలు..?
ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అత్యధిక పరుగులు చేసిన రెండో కెప్టెన్ గా నిలిచాడు. అయ్యర్ 9 మ్యాచ్ల్లో మూడు అర్ద సెంచరీల సహాయంతో మొత్తం 288 పరుగులు చేశాడు. అంటే.. శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ మధ్య 100 పరుగుల వ్యత్యాసం ఉంది. కాగా, గుజరాత్కు అతిపెద్ద బలం ఆ జట్టు టాప్ ఆర్డర్. సాయి సుదర్శన్, శుభ్ మన్ గిల్, జోస్ బట్లర్ ఇలా ఎవరో ఒకరు పరుగుల వరద పారిస్తూ.. జట్టు బాధ్యతను తీసుకుంటున్నారు.
Read Also: Hyderabad: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం.. రూ.1.40కోట్ల విలువైన డ్రగ్స్, గంజాయి స్వాధీనం
అయితే, పంజాబ్ బ్యాటర్లలో ఒక్కరు కూడా కన్సిస్టెన్సీగా బ్యాటింగ్ చేయకపోవడం ఆ జట్టుకు మైనస్ గా మారింది. అయితే, అయ్యర్ నాయకత్వంకు మంచి మార్కులే పడుతున్నాయి. ఈ సీజన్లో పంజాబ్ 9 మ్యాచుల్లో 5 గెలిచి 11 పాయింట్లతో టాప్ ఫైవ్ లో ఉంది. మొత్తం సీజన్ విషయానికి వస్తే సాయి సుదర్శన్ 456 పరుగులతో టేబుల్ టాప్ లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత స్థానములో విరాట్ కోహ్లీ 443 పరుగులతో ఉన్నాడు. చూడాలిమరి! గత సీజన్ లో కప్ గెలిచిన శ్రేయాస్ అయ్యర్ మరోసారి కప్ అందుకుంటాడో.. లేక గిల్ అందుకుంటాడో.
తాజావార్తలు
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం.. సీబీఐ దర్యాప్తుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు
-
Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
-
KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
-
Natural Home Cooling Tips: కూలర్, ఏసీ లేకుండానే కూల్ కూల్గా ఇల్లు.. ! మన తాతముత్తాతలు ఉపయోగించిన చిట్కాలు ఇవే..!
-
Peddi : చరణ్ ‘పెద్ది’ కోసం రంగంలోకి బాలయ్య..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!