IPL 2025: గిల్ vs అయ్యర్.. క్రేజీ పోటీ మాములుగా లేదుగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2025: తొలి సీజన్లోనే ఛాంపియన్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ గతేడాది లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. కానీ, ఈ సీజన్ లో మాత్రం ఆ జట్టు అసాధార ప్రదర్శనతో అదరగొడుతుంది. శుభ్ మన్ గిల్ నేతృత్వంలో గుజరాత్ టైటాన్స్ సమిష్టిగా రాణిస్తూ ప్లేఆప్స్ రేసులో నిలిచింది. ఈ సీజన్ లో ఇప్పటివరకు 9 మ్యాచుల్లో ఆరు గెలిచి 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. గుజరాత్ ను సక్సెస్ ఫుల్ గా నడిపించడంలో కెప్టెన్ గిల్ విజయం సాధించాడు. ఈ సీజన్లో అద్భుత ఫామ్ తో రాణించిన గిల్.. రెండు భారీ ఇన్నింగ్స్ ఆడాడు. తాజాగా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ పై 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేయగా.. అంతకుముందు మ్యాచ్ లో కేకేఆర్ పై 10 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో 90 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ రెండు ఇన్నింగ్స్ లో సెంచరీ చేరువలో అవుటైన గిల్ ఈ ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన నంబర్ వన్ కెప్టెన్ గా నిలిచాడు. ఈ సీజన్ లో మొత్తంగా 9 మ్యాచ్ల్లో 156 స్ట్రైక్ రేట్ తో 389 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలు నమోదయ్యాయి.
Also Read
- Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అత్యధిక పరుగులు చేసిన రెండో కెప్టెన్ గా నిలిచాడు. అయ్యర్ 9 మ్యాచ్ల్లో మూడు అర్ద సెంచరీల సహాయంతో మొత్తం 288 పరుగులు చేశాడు. అంటే.. శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ మధ్య 100 పరుగుల వ్యత్యాసం ఉంది. కాగా, గుజరాత్కు అతిపెద్ద బలం ఆ జట్టు టాప్ ఆర్డర్. సాయి సుదర్శన్, శుభ్ మన్ గిల్, జోస్ బట్లర్ ఇలా ఎవరో ఒకరు పరుగుల వరద పారిస్తూ.. జట్టు బాధ్యతను తీసుకుంటున్నారు.
Read Also: Hyderabad: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం.. రూ.1.40కోట్ల విలువైన డ్రగ్స్, గంజాయి స్వాధీనం
అయితే, పంజాబ్ బ్యాటర్లలో ఒక్కరు కూడా కన్సిస్టెన్సీగా బ్యాటింగ్ చేయకపోవడం ఆ జట్టుకు మైనస్ గా మారింది. అయితే, అయ్యర్ నాయకత్వంకు మంచి మార్కులే పడుతున్నాయి. ఈ సీజన్లో పంజాబ్ 9 మ్యాచుల్లో 5 గెలిచి 11 పాయింట్లతో టాప్ ఫైవ్ లో ఉంది. మొత్తం సీజన్ విషయానికి వస్తే సాయి సుదర్శన్ 456 పరుగులతో టేబుల్ టాప్ లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత స్థానములో విరాట్ కోహ్లీ 443 పరుగులతో ఉన్నాడు. చూడాలిమరి! గత సీజన్ లో కప్ గెలిచిన శ్రేయాస్ అయ్యర్ మరోసారి కప్ అందుకుంటాడో.. లేక గిల్ అందుకుంటాడో.
తాజావార్తలు
-
Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
-
NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
-
Fridge Storage Tips : ఫ్రిజ్లో ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి.. చాలామంది చేసే తప్పులు ఇవే!
-
Nasser Hussain: బెన్ స్టోక్స్.. నువ్ చేసింది తప్పే, కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకోవద్దు!
-
Opendoor India Exit: భారత్కు గుడ్బై చెప్పిన ఓపెన్డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!