IPL 2025: గిల్ vs అయ్యర్.. క్రేజీ పోటీ మాములుగా లేదుగా!
IPL 2025: తొలి సీజన్లోనే ఛాంపియన్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ గతేడాది లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. కానీ, ఈ సీజన్ లో మాత్రం ఆ జట్టు అసాధార ప్రదర్శనతో అదరగొడుతుంది. శుభ్ మన్ గిల్ నేతృత్వంలో గుజరాత్ టైటాన్స్ సమిష్టిగా రాణిస్తూ ప్లేఆప్స్ రేసులో నిలిచింది. ఈ సీజన్ లో ఇప్పటివరకు 9 మ్యాచుల్లో ఆరు గెలిచి 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. గుజరాత్ ను సక్సెస్ ఫుల్ గా నడిపించడంలో కెప్టెన్ గిల్ విజయం సాధించాడు. ఈ సీజన్లో అద్భుత ఫామ్ తో రాణించిన గిల్.. రెండు భారీ ఇన్నింగ్స్ ఆడాడు. తాజాగా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ పై 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేయగా.. అంతకుముందు మ్యాచ్ లో కేకేఆర్ పై 10 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో 90 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ రెండు ఇన్నింగ్స్ లో సెంచరీ చేరువలో అవుటైన గిల్ ఈ ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన నంబర్ వన్ కెప్టెన్ గా నిలిచాడు. ఈ సీజన్ లో మొత్తంగా 9 మ్యాచ్ల్లో 156 స్ట్రైక్ రేట్ తో 389 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలు నమోదయ్యాయి.
Also Read
- Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
- GT VS PBKS: గుజరాత్ బౌలర్ల ధాటికి పంజాబ్ విలవిల.. తక్కువ స్కోర్కే పరిమితమైన PBKS..
- Rishab Pant: రిషబ్ పంత్ ఆట ముగిసిందా..? లక్నో కెప్టెన్ ఫామ్పై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
- AC Blast: ఏసీ పేలుడు 9 మంది మృతికి ఎలా కారణమైంది.? ఢిల్లీ ఘటనలో కీలక విషయాలు..
ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అత్యధిక పరుగులు చేసిన రెండో కెప్టెన్ గా నిలిచాడు. అయ్యర్ 9 మ్యాచ్ల్లో మూడు అర్ద సెంచరీల సహాయంతో మొత్తం 288 పరుగులు చేశాడు. అంటే.. శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ మధ్య 100 పరుగుల వ్యత్యాసం ఉంది. కాగా, గుజరాత్కు అతిపెద్ద బలం ఆ జట్టు టాప్ ఆర్డర్. సాయి సుదర్శన్, శుభ్ మన్ గిల్, జోస్ బట్లర్ ఇలా ఎవరో ఒకరు పరుగుల వరద పారిస్తూ.. జట్టు బాధ్యతను తీసుకుంటున్నారు.
Read Also: Hyderabad: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం.. రూ.1.40కోట్ల విలువైన డ్రగ్స్, గంజాయి స్వాధీనం
అయితే, పంజాబ్ బ్యాటర్లలో ఒక్కరు కూడా కన్సిస్టెన్సీగా బ్యాటింగ్ చేయకపోవడం ఆ జట్టుకు మైనస్ గా మారింది. అయితే, అయ్యర్ నాయకత్వంకు మంచి మార్కులే పడుతున్నాయి. ఈ సీజన్లో పంజాబ్ 9 మ్యాచుల్లో 5 గెలిచి 11 పాయింట్లతో టాప్ ఫైవ్ లో ఉంది. మొత్తం సీజన్ విషయానికి వస్తే సాయి సుదర్శన్ 456 పరుగులతో టేబుల్ టాప్ లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత స్థానములో విరాట్ కోహ్లీ 443 పరుగులతో ఉన్నాడు. చూడాలిమరి! గత సీజన్ లో కప్ గెలిచిన శ్రేయాస్ అయ్యర్ మరోసారి కప్ అందుకుంటాడో.. లేక గిల్ అందుకుంటాడో.
తాజావార్తలు
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
-
GT VS PBKS: గుజరాత్ బౌలర్ల ధాటికి పంజాబ్ విలవిల.. తక్కువ స్కోర్కే పరిమితమైన PBKS..
-
Karimnagar PMJ Jewellery : పీఎంజే జ్యువెల్లరీ దొంగల ఫోటోలు విడుదల.. ఆచూకీ చెబితే లక్ష నజరానా.!
-
Rishab Pant: రిషబ్ పంత్ ఆట ముగిసిందా..? లక్నో కెప్టెన్ ఫామ్పై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!