Ayodhya Diwali: ప్రపంచ రికార్డు సృష్టించేందుకు రెడీ అవుతున్న రాంలాలా ఆలయం
- ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో.
- ప్రపంచ రికార్డు సృష్టించేందుకు రెడీ..
- మహా దీపోత్సవంలో 28 లక్షల దీపాలను అలంకరించేందుకు 30 వేల మందికి పైగా వాలంటీర్ల నియామకం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Diwali: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఎనిమిదో దీపోత్సవం సందర్భంగా సరయూ నది ఒడ్డున 28 లక్షల దీపాలను వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో రాంలాలా ఆలయంలో ఈసారి ప్రత్యేక దీపాలను వెలిగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నూతనంగా నిర్మించిన శ్రీరామ జన్మభూమి ఆలయంలో మొదటి దీపావళికి గ్రాండ్ గా “పర్యావరణ స్పృహ”తో సన్నాహాలు జరుగుతున్నాయి. అక్టోబరు 30న సరయూ ఘాట్ల వద్ద జరిగే మహా దీపోత్సవంలో 28 లక్షల దీపాలను అలంకరించేందుకు 30 వేల మందికి పైగా వాలంటీర్లను నియమించారు.
Read Also: Fire Accident : అబిడ్స్లోని క్రాకర్స్ షాపులో భారీ అగ్నిప్రమాదం…
Also Read
- Yashpal Sharma: 1983 ప్రపంచకప్లో అసలైన సూపర్మ్యాన్.. భారత్ మరిచిన హీరో జయంతి నేడు..
- 7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
- రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
- Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ప్రకారం, ఈ ప్రత్యేక రకాల దీపాలు ఆలయ భవనాన్ని మరకలు, మసి నుండి కాపాడతాయి. అలాగే ఎక్కువ సేపు కాంతిని కూడా అందిస్తాయి. శ్రీరామజన్మభూమి ఆలయాన్ని ఆకర్షణీయమైన పూలతో అలంకరించేందుకు ప్రత్యేక ప్రణాళికను కూడా రూపొందించినట్లు తెలిపారు. ఆలయ సముదాయాన్ని అనేక విభాగాలుగా, ఉపవిభాగాలుగా విభజించి అలంకరణ బాధ్యతలు అప్పగించారు. బీహార్ కేడర్కు చెందిన రిటైర్డ్ ఐపిఎస్ అధికారి అషు శుక్లాకు ఆలయంలోని ప్రతి మూలను క్రమపద్ధతిలో వెలిగించడం, అన్ని ద్వారాలను తోరణాలతో అలంకరించడం, శుభ్రపరచడం ఇంకా అలంకరణ చేయడం వంటి బాధ్యతలను అప్పగించారు. దీంతో అందమైన పూలతో, దీపాలతో అలంకరించిన ఆలయాన్ని భక్తులు దర్శించుకోనున్నారు. ఈ సారి వెలుగుల పండుగలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు ప్రతినిధి తెలిపారు.
Read Also: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నిద్రమత్తుకు ఇద్దరు బలి
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా, అవధ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ ప్రతిభా గోయల్ ఉద్దేశం మేరకు సరయూలోని 55 ఘాట్ల వద్ద ఈ భారీ వాలంటీర్ల బృందాన్ని మోహరించారు. రెండు వేల మందికి పైగా సూపర్ వైజర్లు, కోఆర్డినేటర్లు, ఘాట్ ఇన్ఛార్జ్లు, దీపాల లెక్కింపు, ఇతర సభ్యుల పర్యవేక్షణలో 30 వేల మందికి పైగా వాలంటీర్లు ఘాట్ల వద్ద 28 లక్షల దీపాలను అలంకరించేందుకు కృషి చేస్తున్నారని ప్రతినిధి తెలిపారు.
తాజావార్తలు
-
Explainer: ఉద్యోగాల కోసం ఎదురుచూపులు.. ఆగిపోతున్న గుండెలు.. ఇంకెన్నాళ్లీ బాధలు?
-
Gaja Teaser: ప్రేమించిన అమ్మాయినే చంపేశాడు.. లవ్ స్టోరీలో ఇంత షాకింగ్ ట్విస్ట్ ఏంటి?.. ‘గజ’ టీజర్ అదిరిందిగా!
-
Sourav Ganguly Death Threats: మిమ్మల్ని చంపేస్తాం.. సౌరవ్ గంగూలీ, సతీమణి డోనాకి బెదిరింపులు!
-
Yashpal Sharma: 1983 ప్రపంచకప్లో అసలైన సూపర్మ్యాన్.. భారత్ మరిచిన హీరో జయంతి నేడు..
-
Ajith Kumar : అజిత్ కుమార్ – విక్టరీ వెంకటేష్ – మోహన్ లాల్.. భారీ పాన్ ఇండియా సినిమా?
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!