Heat wave warning: ఈ రాష్ట్రాలకు వేడిగాలుల ముప్పు.. వాతావరణశాఖ అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగమండిపోతున్నాడు. దీంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరోవైపు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఇక పిల్లలు, వృద్ధులైతే వేడి తీవ్రతను తట్టుకోలేక బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా వాతావరణ శాఖ మరోసారి హెచ్చరించింది. మరో వారం పాటు తీవ్ర వేడిగాలులు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: రాహుల్ గాంధీ దేశానికి కాబోయే ప్రధాని.. 20 ఏళ్లు ఆయనే ఉంటారు..
Also Read
- Trinamool Congress: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. ఇలా చేసిందేంటి..
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
- Tamballapalle MLA: చావడానికైనా, చంపడానికైనా సిద్ధం.. తంబళ్లపల్లె ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
- Tim David: నీకు ఫైన్ వేయడంలో ఏమాత్రం తప్పు లేదయ్యా.. గ్రౌండ్ లోనే సిగార్ తాగుతూ రచ్చ రచ్చ.!
ఏప్రిల్ 17 నుంచి 21 వరకు గంగానది పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ప్రజలు ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని సూచించింది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఏప్రిల్ 17-18 తేదీల్లో గంగా పశ్చిమ బెంగాల్, ఏప్రిల్ 17-21 వరకు బీహార్, ఏప్రిల్ 19- 21 వరకు జార్ఖండ్, ఏప్రిల్ 17, 20 మరియు 21 తేదీల్లో ఒడిశాలో హీట్ వేవ్ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు సురక్షితంగా ఉండటానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Suresh Raina: ధోనీ నెక్స్ట్ సీజన్ ఐపీఎల్ ఆడటంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
వేడి తరంగాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ప్రత్యేకించి వృద్ధులు, పిల్లలు ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. అందుకు తగినట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. హార్ట్ పేషెంట్లు చల్లని, నీడ ప్రాంతాల్లో ఉండాలని తెలిపింది. సూర్యకాంతి పడకుండా చూసుకోవాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Amit Shah: మావోయిస్టులను దేశంలో లేకుండా చేస్తాం..
భారత్లో ఎండలు ఇలా దంచికొడుతుంటే.. పశ్చిమాసియలో మాత్రం వరదలు ముంచెత్తాయి. మంగళవారం కురిసిన కుండపోత వర్షానికి ఒమెన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అల్లాడిపోయాయి. కార్లు, బైకులు, వస్తువులు వరదల్లో కొట్టుకుపోయాయి. ఇప్పటికే పలువురు మృత్యువాత పడ్డారు. బుధవారం కూడా వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తాజావార్తలు
-
Trinamool Congress: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. ఇలా చేసిందేంటి..
-
Ntv Exclusive: ‘పెద్ది’తో రామ్ చరణ్ విశ్వరూపం.. కంటతడి పెట్టించేశాడట!
-
Stock Market Crash: కుప్పకూలిన షేర్ మార్కెట్.. సెన్సెక్స్ 1100 పాయింట్లు పతనం.. లక్షల కోట్లు గాల్లోనే!
-
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
-
Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!