Yellow Alert: రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
Sriram Kumar Natte
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
రానున్న 24గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు
రుతుపవనాలు చురుగ్గా మారడంతో ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన
గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు
Maxresdefault
Rain Alert In Telugu States: నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనావేసింది. ఉత్తర ఒడిశా తీరం సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ వెల్లడిచింది. దీని ప్రభావంతో రానున్న 24గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది. శనివారం, ఆదివారం 15 జిల్లాల్లో బలమైన గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడిచింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లోనూ తేలికిపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో కూడా రుతుపవనాలు చురుగ్గా మారడంతో ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణశాఖ.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లకూడదు అని అధికారుల ఆదేశాలు జారీ చేశారు. రానున్న రెండు రోజులు ఏపీలో భారీ నుంచి అతి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ చెబుతుంది. సముద్ర తీర ప్రాంతాల ప్రజలు అప్రమతంగా ఉండాలి అని అలానే అధికారులు కూడా రానున్న వర్షాలు దృష్టిలో పెట్టుకుని తగిన చర్యలు తీసుకోవాలి అని లోతట్టు వాసులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సురిక్షిత ప్రాంతాలకి పంపాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది..