Chegunta: ఆ ఊరికి ఏమైంది.. దీపావళి నుంచి 70మంది గ్రామస్తులకు వాంతులు విరేచనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chegunta: మెదక్ జిల్లా చేగుంట మండలం పెద్ద శివునూరు గ్రామస్తులు దీపావళి నుంచి భయాందోళనలో ఉన్నారు. ఏం జరుగుతుందో తెలియడం లేదు. పండగరోజు నుంచి 70మందికి పైగా గ్రామస్తులకు వాంతు, విరేచనాలు అవుతున్నాయి. దాంతో వారిని చేగుంట ప్రాథమిక ఆస్పత్రిల్లో చేర్పించారు కుటుంబీకులు. 70మంది ఆస్పత్రిలో చేరడంతో రోగులతో కిటకిటలాడుతోంది. సీరియస్ గా ఉన్న వారికి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాదులోని కార్పోరేట్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. అనంతరం చేగుంట పీహెచ్ సీ సిబ్బంది ఆ గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. చేగుంట పీహెచ్సీ డాక్టర్ పుష్పలత, వైద్యసిబ్బంది రోగులకు నిరంతర వైద్య సాయం అందజేస్తున్నారు. కొంత మంది తుప్రాన్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామస్తులకు వాంతులకు, విరేచనాలకు గల కారణాలు తెలియరాలేదు.
Also Read
- 12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
- Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
ఇది ఇలా ఉండగా వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురై మల్లమ్మ(60) అనే మహిళ చనిపోయింది. ఆమె సిద్ధిపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. వారం పాటు చికిత్స తీసుకున్నా ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. పలువుగు గత వారం రోజులుగా ఆస్పత్రులకే పరిమితమయ్యారు. అస్వస్థతతో మరణించిన వారి సంఖ్య రెండుకు చేరుకుంది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇంతవరకు వారి అస్వస్థతకు కారణాలు తెలియడం లేదు. అస్వస్థతకు గురై పీహెచ్సీలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి సూచించారు. పెద్దశివునూర్ గ్రామంలో చికిత్స పొందుతున్న వారితో పాటు పలు చోట్ల ఆయా దవాఖానాల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్య అధికారులతో ఫోన్లో మాట్లాడారు.
తాజావార్తలు
-
Pakistani Cinema: నెట్ఫ్లిక్స్తో భాగస్వామ్యానికి పాకిస్తాన్ ప్రయత్నాలు.. గ్లోబల్ స్ట్రీమింగ్పై ఫోకస్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Prabhas : ‘స్పిరిట్’కు బ్రేక్ ఇచ్చి ‘ఫౌజీ’ సెట్స్ లోకి ప్రభాస్
-
HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
ట్రెండింగ్
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?