Chegunta: ఆ ఊరికి ఏమైంది.. దీపావళి నుంచి 70మంది గ్రామస్తులకు వాంతులు విరేచనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chegunta: మెదక్ జిల్లా చేగుంట మండలం పెద్ద శివునూరు గ్రామస్తులు దీపావళి నుంచి భయాందోళనలో ఉన్నారు. ఏం జరుగుతుందో తెలియడం లేదు. పండగరోజు నుంచి 70మందికి పైగా గ్రామస్తులకు వాంతు, విరేచనాలు అవుతున్నాయి. దాంతో వారిని చేగుంట ప్రాథమిక ఆస్పత్రిల్లో చేర్పించారు కుటుంబీకులు. 70మంది ఆస్పత్రిలో చేరడంతో రోగులతో కిటకిటలాడుతోంది. సీరియస్ గా ఉన్న వారికి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాదులోని కార్పోరేట్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. అనంతరం చేగుంట పీహెచ్ సీ సిబ్బంది ఆ గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. చేగుంట పీహెచ్సీ డాక్టర్ పుష్పలత, వైద్యసిబ్బంది రోగులకు నిరంతర వైద్య సాయం అందజేస్తున్నారు. కొంత మంది తుప్రాన్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామస్తులకు వాంతులకు, విరేచనాలకు గల కారణాలు తెలియరాలేదు.
Also Read
- CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
- Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
- Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
- Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
ఇది ఇలా ఉండగా వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురై మల్లమ్మ(60) అనే మహిళ చనిపోయింది. ఆమె సిద్ధిపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. వారం పాటు చికిత్స తీసుకున్నా ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. పలువుగు గత వారం రోజులుగా ఆస్పత్రులకే పరిమితమయ్యారు. అస్వస్థతతో మరణించిన వారి సంఖ్య రెండుకు చేరుకుంది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇంతవరకు వారి అస్వస్థతకు కారణాలు తెలియడం లేదు. అస్వస్థతకు గురై పీహెచ్సీలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి సూచించారు. పెద్దశివునూర్ గ్రామంలో చికిత్స పొందుతున్న వారితో పాటు పలు చోట్ల ఆయా దవాఖానాల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్య అధికారులతో ఫోన్లో మాట్లాడారు.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : 22ఏ భూములపై మంత్రి పొంగులేటి బిగ్ క్లారిటీ
-
CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
-
Anasuya: హిందూ ఆచారాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు.. అసలు స్కెచ్ ఇదేనా!
-
Tollywood Wedding: సైలెంట్గా న్యూజిలాండ్లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. తన రియల్ హీరోయిన్తో ఫోటోలు వైరల్!
-
Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!