T20 World Cup 2026 India: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 దశ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ ఆమిర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ లో భారత్ సెమీ ఫైనల్కు చేరదని చేసిన అంచనా టీమిండియా అభిమానులకు ఆగ్రహానికి గురి చేసింది.
Biryani Hotels: హైదరాబాద్ లోని బిర్యానీ హోటల్స్ లో తనిఖీతో.. రూ.70 వేల కోట్ల స్కాం వెలుగులోకి
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో సూపర్-8 రౌండ్ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో మొత్తం 8 జట్లు రెండు గ్రూపులుగా విభజించబడ్డాయి. ఇందులో గ్రూప్-1లో భారత్, జింబాబ్వే, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. ఈ నాలుగు జట్లు కూడా గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సూపర్-8కు చేరుకున్నాయి. భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ నాలుగు మ్యాచ్ల్లో నాలుగు విజయాలు సాధించగా.. జింబాబ్వే మాత్రం మూడు విజయాలు, ఒక మ్యాచ్ వర్షం కారణంగా ‘నో రిజల్ట్’తో గ్రూప్ దశ నుంచి సూపర్ 8 కు చేరుకుంది. ఇక గ్రూప్-2లో శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి.
సూపర్ 8 మ్యాచ్ ల ముందు జియో టీవీ కార్యక్రమంలో మొహమ్మద్ ఆమిర్ మాట్లాడిన అతను పనికమాలిన వ్యాఖ్యలు చేశాడు. ఈ టీ20 వరల్డ్ కప్లో భారత్ సెమీ ఫైనల్కు చేరదని నా అభిప్రాయం అని.. పాకిస్తాన్ పై జరిగిన మ్యాచ్ను మినహాయిస్తే, మిగతా మ్యాచ్ల్లో భారత బ్యాటింగ్ ఆశించిన స్థాయిలో లేదని పేర్కొన్నాడు. సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ప్రస్తుతం అద్భుత ఫామ్ లో ఉన్నాయని.. ఆ ఇరు జట్లు ఏ జట్టునైనా ఓడించే సామర్థ్యం కలిగి ఉన్నాయని అన్నారు.
Donald Trump: 11 యుద్ధ విమానాలు కూలిపోయాయి.. ట్రంప్ నోట మళ్లీ అదే మాట..
భారత్ సూపర్-8 షెడ్యూల్:
* ఫిబ్రవరి 22 – సౌతాఫ్రికాతో (అహ్మదాబాద్)
* ఫిబ్రవరి 26 – జింబాబ్వేతో (చెన్నై)
* మార్చి 1 – వెస్టిండీస్తో (కోల్కతా)
