ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ చివరి మ్యాచ్లు భారత్లోనే..
- ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించి కీలక అప్డేట్స్
- జనవరిలో భారత్కు ఛాంపియన్స్ ట్రోఫీ వస్తుందని ప్రకటించిన ఐసీసీ
- జనవరి 15 నుంచి 26 వరకు భారత్లో ఛాంపియన్స్ ట్రోఫీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించి కీలక అప్డేట్స్ వస్తున్నాయి. జనవరిలో భారత్కు ఛాంపియన్స్ ట్రోఫీ వస్తుందని ఐసీసీ ప్రకటించింది. ఈ ట్రోఫీకి హోస్టింగ్తో సంబంధం లేదు.. పెద్ద టోర్నమెంట్లకు ముందు ఐసీసీ ఈ ట్రోఫీ పర్యటనను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ నుంచి భారత్కు రానుంది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ట్రోఫీ టూర్ నవంబర్ 16 నుండి ప్రారంభమైందని.. 2025 జనవరి 26 వరకు కొనసాగుతుందని ఐసీసీ మీడియా ప్రకటనలో తెలిపింది. ఛాంపియన్స్ ట్రోఫీ చివరిగా భారత్కు రానుంది. ఈ ట్రోఫీ షెడ్యూల్ నవంబర్ 16 నుండి 25 వరకు పాకిస్తాన్లోని వివిధ నగరాల్లో జరుగుతుంది. ఆ తర్వాత నవంబర్ 26 నుండి 28 వరకు ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతుంది. డిసెంబర్ 10 నుండి 13 వరకు బంగ్లాదేశ్లో ఉంటుంది. ఆ తర్వాత.. డిసెంబర్ 15 నుంచి 22 వరకు దక్షిణాఫ్రికాలో ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ జరగనుంది.
Also Read
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
Read Also: Vande Bharat: వందే భారత్ రైలు ఆహారంలో పురుగులు.. జీలకర్ర అని ఉద్యోగి దబాయింపు
దక్షిణాఫ్రికా తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పర్యటన ఆస్ట్రేలియాకు చేరుకుంటుంది. అక్కడ ట్రోఫీ డిసెంబర్ 25 నుండి జనవరి 5 వరకు దేశంలోని వివిధ నగరాలలో నిర్వహిస్తుంది. ఆ తర్వాత.. ట్రోఫీ జనవరి 6 నుండి 11 వరకు న్యూజిలాండ్లో ఉంటుంది. ఆపై ట్రోఫీ జనవరి 12 నుండి 14 వరకు ఇంగ్లాండ్కు వెళుతుంది. ఆ తర్వాత భారత్కు రానుంది. జనవరి 15 నుంచి 26 వరకు భారత్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఆ తర్వాత ట్రోఫీ పాకిస్థాన్లో జరుగుతుంది.
జనవరి 27న పాకిస్థాన్లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత టోర్నీకి మిగిలిన సన్నాహాలు ప్రారంభమవుతాయి. ఈ టోర్నీ ఫిబ్రవరి-మార్చిలో జరగాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు వస్తున్న రిపోర్టుల ప్రకారం ఈ టోర్నీని పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనుంది. భారత్ మూడు లీగ్ మ్యాచ్లు.. ఒక సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్ దుబాయ్లో ఆడనుంది.
తాజావార్తలు
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
Disha Salian Death Case: ‘నేను ఇకపై మౌనంగా ఉండను’… దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!