Rohit Sharma: రోహిత్ శర్మకు లాస్ట్ ఛాన్స్.. పునరావృతం అయితే ఇదే చివరి ఐసీసీ టోర్నీ!
- ఇంగ్లండ్తో వన్డే, టీ20 సిరీస్
- రోహిత్ శర్మకు లాస్ట్ ఛాన్స్
- సంజూ శాంసన్కు అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్వదేశంలో ఇంగ్లండ్తో వన్డే, టీ20 సిరీస్లకు.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు భారత్ సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ రెండు సిరీస్లకు బీసీసీఐ సెలెక్టర్లు జట్లను ప్రకటించనున్నారు. ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసే జట్టునే.. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో ఆడించే అవకాశం ఉంది. అయితే న్యూజీలాండ్, ఆస్ట్రేలియా సిరీస్లలో విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మను జట్టుకు ఎంపిక చేస్తారా? లేదా? అనేది అనుమానంగా ఉంది. దీనిపై బీసీసీఐ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.
ఫామ్ లేమి కారణంగా ఇంగ్లండ్తో సిరీస్కు రోహిత్ శర్మకు విశ్రాంతిని ఇచ్చి.. హార్దిక్ పాండ్యాకు సారథ్యం అప్పగిస్తారనే వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి రోహిత్ నాయకత్వంలోనే టీమిండియా బరిలోకి దిగబోతోందని బీసీసీఐ వర్గాలు అంటుండగా.. ఇంగ్లండ్తో సిరీస్కూ హిట్మ్యాన్ను ఎంపిక చేస్తారని తెలుస్తోంది. రోహిత్కు చివరి అవకాశం ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆసీస్ పర్యటన ప్రదర్శన పునరావృతం అయితే.. రోహిత్కు ఇదే చివరి ఐసీసీ టోర్నీ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రోహిత్తో పాటు విరాట్ కోహ్లీకి కూడా అవకాశం ఇవ్వడం ఖాయం. విరాట్ ఫామ్ కూడా గొప్పగా లేదు కానీ.. కింగ్ ఆటపై బీసీసీఐ సెలక్టర్లు విశ్వాసం ఉంచనున్నారు. జనవరి 12 లోపు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ 2-3 రోజుల్లో బీసీసీఐ జట్లను ప్రకటించనుంది.
Also Read
- Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
- Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
- UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
- PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
Also Read: OnePlus 13 Launch: ‘వన్ప్లస్ 13’ సిరీస్ స్మార్ట్ఫోన్లు వచ్చేశాయి.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్న ఫాస్ట్బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ సిరీస్కు దూరమయ్యే అవకాశముంది. మోకాలిలో వాపు కారణంగా ఆస్ట్రేలియా సిరీస్కు దూరంగా ఉన్న సీనియర్ పేసర్ మహ్మద్ షమీ తిరిగి జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్తో సిరీస్కు రిషబ్ పంత్కు విశ్రాంతి ఇస్తారని తెలుస్తోంది. అదే నిజమైతే తుది జట్టులో సంజూ శాంసన్కు అవకాశం దక్కనుంది. హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, అర్ష్దీప్ సింగ్లు ఇంగ్లండ్ వన్డే సిరీస్కు ఎంపిక అవుతారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!