NTV Telugu Site icon

T20 World Cup 2025: టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్ విడుదల.. వెస్టిండీస్‌తో భారత్‌ తొలి మ్యాచ్!

India Schedule

India Schedule

India Schedule For U19 Women’s T20 World Cup 2025: మహిళల అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌ 2025 షెడ్యూల్‌ను ఐసీసీ ఆదివారం ప్రకటించింది. ఈ టోర్నమెంట్ 2025 జనవరి 18న మలేసియాలో ఆరంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 2న జరగనుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ తన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. 2023లో జరిగిన మొదటి అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి భారత్‌ కప్‌ గెలుచుకుంది.

మహిళల అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌ 2025లో 16 జట్లు పాల్గొనున్నాయి. నాలుగు జట్లు చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించి.. షెడ్యూల్ రిలీజ్ చేశారు. నాలుగు వేదికలలో 16 రోజుల పాటు 41 మ్యాచ్‌లు జరగనున్నాయి. జనవరి 13 నుంచి 16 వరకు వార్మప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. గ్రూప్‌-ఏలో విండీస్, మలేసియా, శ్రీలంకతో కలిసి భారత్‌ ఆడనుంది. ఆతిథ్య జట్టు హోదాలో మలేషియా అండర్‌-19 ప్రపంచకప్‌లో అరంగేట్రం చేస్తోంది.

Also Read: Raksha Bandhan 2024 Timings: నేడు రక్షాబంధన్.. రాఖీ కట్టడానికి సరైన సమయం ఇదే!

ప్రతి గ్రూప్‌ నుంచి 3 జట్లు సూపర్‌-6కు అర్హత సాధిస్తాయి. సూపర్‌-6లో ఆరేసి జట్లు గ్రూప్‌-1, గ్రూప్‌-2గా విడిపోయి ఆడతాయి. జనవరి 25 నుంచి 29 సూపర్‌-6 మ్యాచ్‌లు జరుగుతాయి. సూపర్‌ సిక్స్‌లో ప్రతి గ్రూప్‌ నుంచి టాప్‌లో నిలిచిన రెండు జట్లు సెమీస్‌ చేరతాయి. జనవరి 31న సెమీస్‌ మ్యాచ్‌లు జరగనుండగా.. ఫిబ్రవరి 2న ఫైనల్‌ మ్యాచ్ జరుగుతుంది. సెమీస్‌ మ్యాచ్‌లకు, ఫైనల్‌కు రిజర్వ్ డే కూడా షెడ్యూల్ చేశారు. ఫిబ్రవరి 1 సెమీస్‌ మ్యాచ్‌లకు, ఫిబ్రవరి 3న ఫైనల్‌కు రిజర్వ్ డేగా ఉంది.