ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ (I&B మంత్రిత్వ శాఖ) టెలిగ్రామ్కు నోటీసు జారీ చేసింది. OTT ప్లాట్ఫారమ్ల నుండి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. పలు OTT ప్లాట్ఫారమ్లు (జియోసినిమా, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటివి) టెలిగ్రామ్లో తమ కాపీరైట్ కంటెంట్ను పైరసీ ద్వారా పెద్ద ఎత్తున పంచుకుంటున్నారని ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత, 3,142 టెలిగ్రామ్ ఛానెల్స్లో సినిమాలు, OTT కంటెంట్లు పైరసీ రూపంలో పంపిణీ అవుతున్నట్లు గుర్తించారు.
Also Read:Monalisa Got Married: ఇంట్లో నుంచి పారిపోయి.. ప్రేమ పెళ్లి చేసుకున్న మోనాలిసా.. వీడియో వైరల్
ఈ నేపథ్యంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 కింద టెలిగ్రామ్కు నోటీసు జారీ చేసి, ఆ పైరసీ కంటెంట్ను తొలగించాలని ఆదేశించింది I&B మంత్రిత్వ శాఖ. ప్రభుత్వ వర్గాల ప్రకారం, ఈ చర్యలు OTT ప్లాట్ఫారమ్ల ఫిర్యాదుల ఆధారంగా తీసుకున్నాయి. ఇది డిజిటల్ పైరసీపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కీలక చర్యల్లో భాగం. టెలిగ్రామ్ వంటి ప్లాట్ఫారమ్లు పైరసీ కంటెంట్ను తొలగించకపోతే మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
టెలిగ్రామ్లో కొత్త ఫీచర్లు
ఈ నెల ప్రారంభంలో, టెలిగ్రామ్ తన తాజా అప్డేట్ (వెర్షన్ 12.5.0)ను విడుదల చేసింది. ఇందులో గ్రూప్లు, చాట్లు, మీడియా కోసం కొత్త ఫీచర్లు ఉన్నాయి. సభ్యుల ట్యాగ్లు, ప్రైవేట్ చాట్లలో ప్రైవసీ కంట్రల్స్, GIF క్యాప్షన్లు, ఎడిటింగ్, ఫోటోల నుండి ఇన్స్టంట్ స్టిక్కర్లు, టెలిగ్రామ్ ఉపయోగించి యాప్లు, వెబ్సైట్లకు లాగిన్ అవ్వడానికి న్యూ సెలెక్షన్ హైలెట్స్.
Also Read:Nara Lokesh: ఢిల్లీలో కూటమి ఎంపీల ఆత్మీయ కలయిక.. రామ్మోహన్ నాయుడు ఇంట్లో లోకేష్ సందడి..
సభ్యుల ట్యాగ్ల గురించి చెప్పాలంటే, గ్రూప్ సభ్యులు ఇప్పుడు వారి పేర్లకు రోల్స్, అధ్యయన రంగాలు లేదా ఆసక్తులను సూచించడానికి ట్యాగ్లను జోడించవచ్చు. ఇది యూజర్లు కార్యాలయంలో, పాఠశాలలో లేదా కమ్యూనిటీ సమూహాలలో తమను తాము గుర్తించుకోవడానికి అనుమతిస్తుంది. సభ్యులు తమ సొంత ట్యాగ్లను సెట్ చేసుకోవచ్చా లేదా ట్యాగ్ అసైన్మెంట్లను అడ్మిన్లకు మాత్రమే పరిమితం చేయవచ్చా అని అడ్మిన్లు నియంత్రించగలరు. గ్రూప్ అడ్మిన్ల ట్యాగ్లు వారి పాత్రను సూచించడానికి వేరే రంగులో కనిపిస్తాయి.
