Simbu : బాలనటుడిగా తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టిన నటుడు శింబు. కేవలం నటనే కాదు ఆయన ఆల్ రౌండర్. సింగిర్, సాహిత్యం, దర్శకత్వం ఇలా అన్నింటిలో ఆయన రాణించారు. శింబు నటనకు ప్రత్యేక అభిమానులున్నారు. ఈ మధ్యకాలంలో శింబు సినిమాలు పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత ‘మనడు’ సినిమాతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చారు. దీని తర్వాత నటుడు శింబు నటించిన ‘వెందు తానంత కాదు’, ‘పతు తాళ’ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ సినిమాలకు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. కలెక్షన్ల రికార్డు కూడా నెలకొల్పాయి.
Read Also: Heavy Rain Hits Hyderabad Live: హైదరాబాద్ ని ముంచెత్తిన వర్షం
ఈ సందర్భంగా నటుడు శింబు ఓ ఛానెల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు ఆయన మాట్లాడుతూ.. ‘నేను మా నాన్నగారి లాగానే చాలా ఎమోషనల్. సినిమాలో చిన్న సెంటిమెంట్ సీన్ వచ్చినప్పుడల్లా కన్నీళ్లు పెట్టుకుంటాను. చాలా రోజుల తర్వాత స్నేహితులు కలుస్తారు. వాళ్ళు మళ్లీ తిరిగి ఊరు వెళ్ళిపోతుంటే వెంటనే ఏడుస్తాను. వాళ్లు ఎంత నచ్చజెప్పినా తట్టుకోలేను. మనమందరం ఏడుస్తూనే పుట్టాము. పదిమంది మన గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా ఎమోషనల్ అవుతాను. అప్పుడు మనం ఏడవకూడదు. అలాంటి పరిస్థితుల్లో నన్ను నేను కంట్రోల్ చేసుకుంటాను’ అంటూ ఓపెన్ మైండెడ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు.
Read Also:Yogi Death Threat: ప్రియురాలి తండ్రి ఫోన్తో కుట్ర.. యోగిని చంపేస్తానన్న వ్యక్తి అరెస్ట్