Hyundai Motor: కార్ల ధరలకు రెక్కలు.. ఏప్రిల్ నుండి హ్యూండాయ్ కార్ల ధరల పెంపు
- కార్ల ధరలకు రెక్కలు.
- ఏప్రిల్ నుండి దాదాపు అన్ని కంపెనీల కార్ల ధరల పెంపు.
- తాజాగా లిస్ట్ లో చేరిన దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యూండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL).
- ఏప్రిల్ నుంచి 3 శాతం వరకు పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyundai Motor: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యూండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) తన వాహనాల ధరలను ఏప్రిల్ నుంచి 3 శాతం వరకు పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కంపెనీ ప్రకారం, ఈ ధర పెంపునకు పెరిగిన ఇన్పుట్ ఖర్చులు, కమ్మోడిటీ ధరలు, ఇంకా అధిక ఆపరేషనల్ వ్యయాలు ప్రధాన కారణాలు అని వెల్లడించింది. ఇప్పటికే టాటా మోటార్స్, మారుతి సుజుకి, కియా వంటి ఇతర ఆటోమొబైల్ బ్రాండ్లు ఏప్రిల్ నుండి తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇప్పుడు హ్యూండాయ్ కూడా ఈ జాబితాలో చేరింది. ఇతర కంపెనీల మాదిరిగానే హ్యూండాయ్ కూడా పెరిగిన ఉత్పత్తి ఖర్చులను వినియోగదారులపై బరువుగా మోపాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపింది.
Read Also: SSMB29 : మళ్లీ ఫొటో లీక్.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా..!
Also Read
- Mahabubabad: ఇద్దరు పిల్లల తల్లి దారుణం.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. ఫోన్ చెక్ చేస్తే మైండ్ బ్లాక్..
- Ajinkya Rahane: "ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్టైమ్ గ్రేట్ అతడే".. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
- Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
- Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
ఈ విషయమై హ్యూండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. మేము వినియోగదారులపై భారం పడకుండా ఖర్చులను నియంత్రించేందుకు మాకున్నంతవరకు ప్రయత్నిస్తున్నాం. కానీ, ఆపరేషనల్ ఖర్చులు నిరంతరంగా పెరుగుతున్న నేపథ్యంలో, కొంత భారాన్ని ధరల పెంపు ద్వారా సమతుల్యం చేయాల్సిన అవసరం ఉందని, ఏప్రిల్ 2025 నుండి ఈ చిన్న స్థాయి ధర సవరణ అమలులోకి వస్తుందని అన్నారు. భవిష్యత్తులో వినియోగదారులపై ప్రభావం తక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
హ్యూండాయ్ భారతదేశంలో విస్తృత శ్రేణిలో కార్లను అందిస్తోంది. ఈ బ్రాండ్ పోర్ట్ఫోలియోలో ఉన్న గ్రాండ్ i10, ఎక్స్టర్, వెన్యూ, క్రెటా, ఆల్కజార్, టక్సన్, ఐయోనిక్ 5 వంటి మోడళ్లు ఉన్నాయి. కొత్తగా రాబోయే హ్యూండాయ్ క్రెటా EV కూడా ఈ ధర పెంపుతో మరింత ఖరీదవ్వనుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి లేదా ఏప్రిల్ నెలలో కార్ల తయారీ కంపెనీలు తమ ధరలను సవరించుకుంటాయి. గత కొన్ని సంవత్సరాలుగా అధిక ఇన్పుట్ ఖర్చుల కారణంగా కంపెనీలు ఏడాదికి ఒక్కసారి కాకుండా రెండుసార్లు కూడా ధరలను పెంచే ధోరణి కొనసాగిస్తున్నాయి.
Read Also: Matthew Brownlee: 62ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం.. ఆయన ఎవరంటే?
అయితే, గత నెలలో పాత స్టాక్ను అమ్మడానికి కంపెనీలు భారీ డిస్కౌంట్లను అందించే అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ ఇయర్ ముగియనున్న నేపథ్యంలో డీలర్లు మిగిలిపోయిన స్టాక్ను క్లియర్ చేసేందుకు ఆకర్షణీయమైన తగ్గింపు ధరలను ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి హ్యూండాయ్ కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్నవారు ఈ నెలలోనే మంచి డీల్ పొందాలంటే వెంటనే డీలర్షిప్లను సంప్రదించాలి.
తాజావార్తలు
-
Mahabubabad: ఇద్దరు పిల్లల తల్లి దారుణం.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. ఫోన్ చెక్ చేస్తే మైండ్ బ్లాక్..
-
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
-
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!