HYDRA: జగద్గిరిగుట్టలో హైడ్రా దూకుడు.. ముమ్మరంగా ఆక్రమణల తొలగింపు
- భూదేవి హిల్స్ లో హైడ్రా కూల్చివేతలు.
- పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతల ప్రారంభం.
- పరికిచెరువు ఎఫ్టియల్ బఫర్ జోన్ లో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న హైడ్రాధికారులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYDRA: హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలను గుర్తించి, తొలగించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రా (HYDRA) మరోసారి తన దూకుడును ప్రదర్శించింది. హైడ్రా ప్రధానంగా చెరువులు, నదులు, ప్రభుత్వ భూములు, ఫుట్పాత్లు, రహదారులపై ఏర్పడ్డ అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. నగరంలో ప్రణాళికా ప్రకారంగా అభివృద్ధి జరగాలని, అక్రమ ఆక్రమణలతో చెరువులు, బఫర్ జోన్ ప్రాంతాలు నాశనం కాకుండా ఉండాలని ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. గత కొంత కాలంగా హైడ్రా ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతూ, పలు ప్రాంతాల్లో కూల్చివేతలను చేపడుతోంది.
Read Also: Supreme Court: జడ్జిలపై ఎంక్వైరీ చేయడం దారుణం.. లోక్పాల్కు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
Also Read
- Mithali Raj: ఇకనైనా 'స్మృతి మందాన'ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!
- Rohit Sharma Retirement: లార్డ్స్లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడా..!
- India vs England: రెండో వన్డేలో ఓటమిపై కెప్టెన్ గిల్ అసంతృప్తి.. వాళ్లే కారణం..!
- COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
హైదరాబాద్లోని కూకట్పల్లి ఆల్విన్ కాలనీ సమీపంలో హైడ్రా అధికారులు మరోసారి ఆక్రమణలపై గట్టి చర్యలు తీసుకున్నారు. చెరువు పక్కన అక్రమంగా నిర్మించిన భవనాలను జేసీబీలతో నేలమట్టం చేశారు. స్థానికుల ఫిర్యాదుల మేరకు ఆల్విన్ కాలనీ భూదేవి హిల్స్ పరికి చెరువు సమీపంలో అనుమతి లేకుండా నిర్మించిన ఇళ్లను, వాణిజ్య భవనాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. గత కొంతకాలంగా చెరువు పరిసరాల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, గతంలో కట్టిన కొన్ని నిర్మాణాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు.
Read Also: Delhi CM Rekha Gupta: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం..
ఈ ఫిర్యాదుల ఆధారంగా హైడ్రా అధికారులు పోలీసుల భద్రత మధ్య భారీ కూల్చివేత ఆపరేషన్ చేపట్టారు. ఎఫ్టీఎల్ (Full Tank Level), బఫర్ జోన్ అనుసంధానంగా అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిని పూర్తిగా తొలగించారు. హైడ్రా చర్యలు కేవలం కూకట్పల్లి వరకే కాకుండా, జగద్గిరిగుట్ట, గాజులరామారం, మహదేవపురం ప్రాంతాల్లోనూ కొనసాగాయి. జగద్గిరిగుట్ట భూదేవి హిల్స్ సమీపంలోని పరికి చెరువు వద్ద అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. అదేవిధంగా గాజులరామారం సమీపంలోని మహదేవపురం ప్రాంతంలో కొన్ని బేస్మెంట్లను కూల్చివేశారు. చెరువు పరిరక్షణ సమితి సభ్యులు గత వారం హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఆధ్వర్యంలో కూల్చివేత చర్యలు చేపట్టారు. ఈ కూల్చివేతల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.
తాజావార్తలు
-
Mithali Raj: ఇకనైనా ‘స్మృతి మందాన’ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!
-
Samantha : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ఇండస్ట్రీ హిట్ MIB
-
Rohit Sharma Retirement: లార్డ్స్లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడా..!
-
India vs England: రెండో వన్డేలో ఓటమిపై కెప్టెన్ గిల్ అసంతృప్తి.. వాళ్లే కారణం..!
-
RBI New Rules 2026: రుణ ఎగవేతదారులకు ఆర్బీఐ భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!