Hyderabad: నగరంలో ఏకంగా రూ.2 కోట్ల విలువైన చైనా మంజా పట్టివేత.. తగిలితే గొంతు తెగాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ పరిధిలో చైనా మంజా విక్రయాలపై పోలీసులు దాడులు చేపట్టారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన పోలీసులు, విక్రయానికి సిద్ధంగా ఉంచిన దాదాపు రెండు కోట్ల రూపాయల విలువైన చైనా మంజాను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా చైనా మంజా వినియోగం వల్ల జరుగుతున్న ప్రమాదాలపై ఫిర్యాదులు పెరగడంతో టాస్క్ఫోర్స్ పోలీసులతో కలిసి ప్రత్యేక దృష్టి సారించి ఈ తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో ఢిల్లీ, సూరత్, మహారాష్ట్ర నుంచి ఆర్డర్ ఆధారంగా కొంతమంది దుకాణదారులు చైనా మంజాను తెప్పిస్తున్నట్లు వెల్లడైంది. ఇండస్ట్రియల్ అవసరాల కోసం తయారు చేసే ప్రత్యేక దారాన్ని మాంజాగా ఉపయోగిస్తూ యువకులు గాలిపటాలు ఎగురవేస్తున్నారని పోలీసులు గుర్తించారు. సాధారణ మాంజాతో పోలిస్తే తక్కువ ధరకు లభిస్తుండటంతో చైనా మంజా వాడకం పెద్ద ఎత్తున పెరిగిందని అధికారులు తెలిపారు. చైనా మంజా వల్ల పక్షులు, జంతువులు మాత్రమే కాకుండా ద్విచక్ర వాహనదారులు, పాదచారులకు కూడా ప్రాణాపాయం పొంచి ఉందని పోలీసులు హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా చైనా మంజా నిల్వ చేయడం, విక్రయించడం, వినియోగించడం నేరమని స్పష్టం చేసిన అధికారులు, ఈ తరహా కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
Also Read
- 108 Ambulances at District Courts: జిల్లా కోర్టుల వద్ద 108 అంబులెన్సులు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- PoK Protests: "మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!".. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
- Morning Diet Tips: ఉదయాన్నే ఏం తినాలి? ఏం తినకూడదు? నిపుణుల హెచ్చరిక
- Monsoon 2026: రైతన్నలకు బిగ్ అలర్ట్.. ఈ 15 రోజులు అత్యంత కీలకం.. భారీ వర్షాలు!
బ్యాన్ చేసినా చైనా మాంజా అమ్మకాలు ఆగడం లేదు. ఎక్కడికక్కడ గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు జరుగుతున్నాయి. దీని కారణంగా ఇప్పటికే పలువురు మృతి చెందగా.. అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో చైనా మాంజా విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పోలీసులు సూచిస్తున్నారు. దీని కారణంగా ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో వారు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో చైనా మాంజాల వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. నగర ప్రజలు కూడా చైనా మంజా వాడకాన్ని నివారించడంలో సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
READ MORE: YS Jagan: చంద్రబాబు మౌనంగా ఉండటంతోనే శ్రీశైలం ఎగువ భాగంలో తెలంగాణ ప్రాజెక్టులు..
తాజావార్తలు
-
108 Ambulances at District Courts: జిల్లా కోర్టుల వద్ద 108 అంబులెన్సులు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
-
ZombieReddy2 : బాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వంలో సైలెంట్ గా స్టార్ట్ అయిన జాంబీరెడ్డి – 2
-
Petrol, Diesel Prices Reduced: ఇది కదా కావాల్సింది.. పెట్రోల్ ధరలు లీటరు రూ. 5, డీజిల్ ధరలు రూ. 3 తగ్గింపు
-
NTRxTrivikram : ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై తమిళ తంబీల ఆగ్రహం.. కారణమేంటంటే?
-
PoK Protests: “మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!”.. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!