Hyderabad Metro : సవరించిన మెట్రో ఛార్జీలు వివరాలు ఇవే..!
- ప్రయాణికుల ఒత్తిడికి తలొగ్గిన మెట్రో యాజమాన్యం
- పది శాతం డిస్కౌంట్తో మారిన టికెట్ ధరలు
- డిస్కౌంట్ కాదు, ధరల తగ్గింపే కావాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో టికెట్ ధరలు ఇటీవల 20 శాతం పెరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ పెంపుపై ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజలు ధరలు తగిలించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తూ, అధిక టికెట్ రేట్లు నగర ట్రాఫిక్ను మరింతగా పెంచుతాయని హెచ్చరించారు.
Mukesh Ambani: ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కావడంపై మోడీకి ముఖేష్ అంబానీ అభినందనలు
Also Read
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
- Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
- Vegetable Chips: బయట ఫుడ్స్కి గుడ్బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మెట్రో రైలు యాజమాన్యం వెనక్కి తగ్గింది. తాజా నిర్ణయంగా, పెంచిన టికెట్ ధరలపై 10 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అయితే ప్రయాణికులు మాత్రం ఈ తగ్గింపుతో సంతృప్తి చెందడం లేదు. డిస్కౌంట్ ఎప్పుడైనా రద్దు అయ్యే అవకాశం ఉండటంతో, వారు డిస్కౌంట్ కంటే నేరుగా ధరలు తగ్గించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఇక తాజా సమాచారం ప్రకారం, మెట్రో యాజమాన్యం డిస్కౌంట్ వర్తించే కొత్త టికెట్ ఛార్జీలను విడుదల చేసింది. పెంపు తర్వాత కనిష్ట టికెట్ ధర రూ.10 నుంచి రూ.12కి, గరిష్ట ఛార్జీ రూ.60 నుంచి రూ.75కి చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు 10 శాతం తగ్గింపుతో కనిష్ట ఛార్జీ రూ.11, గరిష్ట ఛార్జీ రూ.69కి తగ్గింది. ఈ తగ్గింపు మే 24 నుంచి అమల్లోకి రానుంది. ఈ డిస్కౌంట్ పేపర్ టికెట్లు, క్యూఆర్ టోకెన్లు, డిజిటల్ టికెట్లు, స్మార్ట్ కార్డులకు వర్తించనుంది.
10 శాతం డిస్కౌంటు తర్వాత చార్జీ
0-2 కి.మీ వరకు రూ.11.00 (ఇదే కనిష్ఠం)
2-4 కి.మీ వరకు రూ.17.00
4-6 కి.మీ వరకు రూ.28.00
6-9 కి.మీ వరకు రూ.37.00
9-12 కి.మీ వరకు రూ.47.00
12-15 కి.మీ వరకు రూ.51.00
15-18 కి.మీ వరకు రూ.56.00
18-21 కి.మీ వరకు రూ.61.00
21-24 కి.మీ వరకు రూ.65.00
24 కి.మీ ఆపైన రూ.69.00 (ఇదే గరిష్ఠ ఛార్జీ. ఉదాహరణకు ఎల్బీనగర్ నుంచి చివరి స్టేషన్ మియాపూర్ వరకు మెట్రో టికెట్ ధర 69 రూపాయలు)
తాజావార్తలు
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
-
APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
-
Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
-
Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
-
Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!