Hyderabad Metro : సవరించిన మెట్రో ఛార్జీలు వివరాలు ఇవే..!
- ప్రయాణికుల ఒత్తిడికి తలొగ్గిన మెట్రో యాజమాన్యం
- పది శాతం డిస్కౌంట్తో మారిన టికెట్ ధరలు
- డిస్కౌంట్ కాదు, ధరల తగ్గింపే కావాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో టికెట్ ధరలు ఇటీవల 20 శాతం పెరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ పెంపుపై ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజలు ధరలు తగిలించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తూ, అధిక టికెట్ రేట్లు నగర ట్రాఫిక్ను మరింతగా పెంచుతాయని హెచ్చరించారు.
Mukesh Ambani: ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కావడంపై మోడీకి ముఖేష్ అంబానీ అభినందనలు
Also Read
- AC Usage Tips: మీరు AC వాడుతున్నారా? ఈ 5 చిట్కాలు తప్పక పాటించండి..!
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మెట్రో రైలు యాజమాన్యం వెనక్కి తగ్గింది. తాజా నిర్ణయంగా, పెంచిన టికెట్ ధరలపై 10 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అయితే ప్రయాణికులు మాత్రం ఈ తగ్గింపుతో సంతృప్తి చెందడం లేదు. డిస్కౌంట్ ఎప్పుడైనా రద్దు అయ్యే అవకాశం ఉండటంతో, వారు డిస్కౌంట్ కంటే నేరుగా ధరలు తగ్గించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఇక తాజా సమాచారం ప్రకారం, మెట్రో యాజమాన్యం డిస్కౌంట్ వర్తించే కొత్త టికెట్ ఛార్జీలను విడుదల చేసింది. పెంపు తర్వాత కనిష్ట టికెట్ ధర రూ.10 నుంచి రూ.12కి, గరిష్ట ఛార్జీ రూ.60 నుంచి రూ.75కి చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు 10 శాతం తగ్గింపుతో కనిష్ట ఛార్జీ రూ.11, గరిష్ట ఛార్జీ రూ.69కి తగ్గింది. ఈ తగ్గింపు మే 24 నుంచి అమల్లోకి రానుంది. ఈ డిస్కౌంట్ పేపర్ టికెట్లు, క్యూఆర్ టోకెన్లు, డిజిటల్ టికెట్లు, స్మార్ట్ కార్డులకు వర్తించనుంది.
10 శాతం డిస్కౌంటు తర్వాత చార్జీ
0-2 కి.మీ వరకు రూ.11.00 (ఇదే కనిష్ఠం)
2-4 కి.మీ వరకు రూ.17.00
4-6 కి.మీ వరకు రూ.28.00
6-9 కి.మీ వరకు రూ.37.00
9-12 కి.మీ వరకు రూ.47.00
12-15 కి.మీ వరకు రూ.51.00
15-18 కి.మీ వరకు రూ.56.00
18-21 కి.మీ వరకు రూ.61.00
21-24 కి.మీ వరకు రూ.65.00
24 కి.మీ ఆపైన రూ.69.00 (ఇదే గరిష్ఠ ఛార్జీ. ఉదాహరణకు ఎల్బీనగర్ నుంచి చివరి స్టేషన్ మియాపూర్ వరకు మెట్రో టికెట్ ధర 69 రూపాయలు)
తాజావార్తలు
-
Age Limit Increased: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి పెంపు
-
Jasprit Bumrah-BCCI: ఆఫ్ఘనిస్థాన్తో టెస్టు.. జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ కండిషన్!
-
Mirai 2: ‘మిరాయ్ 2’ వీఎఫ్ఎక్స్ కోసం… తేజ సజ్జా స్మార్ట్ ప్లానింగ్ వైరల్
-
Red Poha Upma: బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా? ఉదయాన్నే కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి!
-
Ravichandran Ashwin: మాహి వస్తున్నాడా? ధోనీ రిటైర్మెంట్ వార్తల మధ్య అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..