Hyderabad Metro: ఆర్టీసీ కార్మికుల సమ్మే వేళ.. ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పిన మెట్రో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Metro: ఆర్టీసీ కార్మికుల సమ్మే వేళ హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది. టీజీఆర్టీసీ సమ్మె ప్రభావంతో మెట్రో సేవలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. హెచ్ఎంఆర్ఎల్ మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచింది. రోజంతా గరిష్టంగా 56 మెట్రో రైళ్లు నడపాలని నిర్ణయించింది. రద్దీ సమయాల్లో ప్రతి 3 నిమిషాలు 40 సెకన్లకు మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. నాన్పీక్ అవర్స్లో రైళ్ల సంఖ్యకు 44 రైళ్లు తగ్గించారు. మియాపూర్–ఎల్బీనగర్ మార్గంలో 4 నిమిషాలు 20 సెకన్లకు ఒక రైలు అందుబాటులో ఉండనుంది. నాగోల్–రాయదుర్గ్ మార్గంలో 3 నిమిషాలు 40 సెకన్లకు మెట్రో రైలు అందుబాటులో ఉంటుంది. సమ్మెతో ఇబ్బందులు తగ్గించేందుకు మెట్రో కీలక చర్యలు తీసుకుంది. రాత్రి మెట్రో సేవల పొడిగింపుపై పరిశీలన చేయనుంది. చివరి మెట్రో రైలు సమయం 11 తర్వాత కూడా ఉండే అవకాశం ఉంది. ప్రయాణికులకు సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది. ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయంగా మెట్రో సేవల విస్తరణ చేశారు.
READ MORE: Delhi: ఢిల్లీలో దారుణం.. యూపీఎస్సీకి సిద్ధపడుతున్న యువతి హత్యాచారం
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్ల విలువ రూ.35 వేల కోట్లని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. తాజాగా తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఎన్టీవీతో మాట్లాడారు. ఆర్టీసీలో ఉన్న సమస్యలు కొత్తవి కావని.. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయన్నారు. మొండి పట్టుదలతో కార్మిక సంఘాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని తెలిపారు. ఆర్టీసీనీ ప్రజల నుంచి దూరం చేయకండి.. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ పరిస్థితి మెరుగు అవుతుందన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని స్పష్టం చేశారు. సమ్మెను విరమించి చర్చల్లో పాల్గొనాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 25% బస్సులు నడుస్తున్నాయని..ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమ్మె ఇల్లీగల్గా చేస్తున్నారని.. ఇది లేబర్ కమిషన్ చెబుతోందన్నారు. ఒక నెలలో ప్రస్తుతం 700 కోట్ల రూపాయల ఆదాయం ఉంటుందని.. ఇలా సంఘాలు కావాలని సమ్మె లోకి వెళితే నష్టాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు.. కాబట్టి సమ్మె విరమించండి.. చర్చలకు రండి… RTC నీ కాపాడండి అని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!