Finance Scam: ఫైనాన్స్ ముసుగులో దారుణాలు.. వెలుగులోకి తండ్రీకొడుకుల బాగోతం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Finance Scam: హైదరాబాద్ బంజారాహిల్స్ కి చెందిన ఫైనాన్స్ వ్యాపారి సునీల్ కుమార్ ఓజా, అతని కుమారుడు ఆశిష్ కుమార్ ఓజా చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఫైనాన్స్ కి కోట్ల రూపాయలు ఇస్తూ వారి భూములను కాజేస్తున్నారు. సునీల్ కుమార్ ఓజా మొదట ఫైనాన్స్ కి డబ్బులు ఇస్తాడు.. అందుకు షూరిటీగా వారికి సంబంధించిన భూమి ఫ్లాట్స్ జిపిఏ లేదా రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. ఇక గడువు అనంతరం ఫైనాన్స్ తీసుకున్నవారు అసలు ఇంట్రెస్ట్ కలిపి చెల్లించిన కొంతమంది రెట్టింపు డబ్బులు చెల్లించినా కూడా తమ భూములను తిరిగి ఇవ్వడం లేదంటూ బాధితులు వాపోతున్నారు. ఈ ఫైనాన్సర్లు వేధింపులకు తాళలేక ఇప్పటికే అనేకమంది దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకున్నట్లు బాధితులు చెబుతున్నారు.
Minister Anitha: ఓ మహిళ సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడకూడదు.. రోజాపై హోంమంత్రి ఫైర్
Also Read
- Off The Record: హ్యాపీ రిటైర్మెంట్ కోసం నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ప్రయత్నాలు
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
- RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
మొకిలాకు చెందిన షేక్ ఫరీద్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి సునీల్ కుమార్ ఓజ వద్ద సుమారు 16 కోట్లు అప్పు తీసుకున్నాడు. అందుకుగాను షూరిటీగా తన వద్ద ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేశాడు. గడువు ముగిసిన అనంతరం ఇంట్రెస్ట్ తో కలిపి 20 కోట్లకు పైగా చెల్లించాడు. కానీ, రిజిస్ట్రేషన్ చేసుకున్న తన భూములను తిరిగి ఇవ్వలేదు. రెండేళ్లుగా తమ భూములు ఇవ్వాలంటూ అడుగుతున్నప్పటికీ తిరిగి తమనే బెదిరింపులకు పాల్పడుతున్నారు అంటూ బాధితులు వాపోతున్నారు. వారి వద్ద ఉన్న రివాల్వర్ తో అనేకమార్లు బెదిరింపులకు పాల్పడ్డట్లు బాధితుడు విన్నవించుకున్నారు.
ఇదే తరహాలో గుండ్ల పోచంపల్లికి చెందిన రఘునందన్ రెడ్డి అనే బాధితుడు కూడా సునీల్ కుమార్ చేతిలో మోసపోయాడు. వారి వద్ద రెండు కోట్లు అప్పు తీసుకుంటే అవి చెల్లించినా కూడా నాలుగు కోట్ల రూపాయలు చెల్లించాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఫైనాన్స్ వల్ల ఆగడాలకు అడ్డు అదుపు లేదు. భారతి బిల్డర్స్ కూడా సునీల్ కుమార్ బాధితులే అని సమాచారం. ఇలా వందలాదిమంది ఫ్లాట్ ఓనర్స్ సునీల్ కుమార్ చేతిలో మోసపోయారు. గతంలో ఈ ఫైనాన్సర్ సునీల్ కుమార్ పై అనేక మోసం చేసిన కేసులు ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు. తాజాగా హైదరాబాద్ సిసిఎస్ పోలీసులను బాధితులు ఆశ్రయించారు. వందలాది మంది బాధితులను మోసం చేస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్న ఈ ఫైనాన్సర్ లపై చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record: హ్యాపీ రిటైర్మెంట్ కోసం నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ప్రయత్నాలు
-
Isaignani Ilaiyaraaja: స్వరాల దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇళయరాజా ప్రస్థానంలో ఎవ్వరికీ తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇవే!
-
Komatireddy Venkat Reddy : పవన్కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
-
WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
-
CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!