NTV Telugu Site icon

Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టు సరికొత్త రికార్డ్.. ఎందులో అంటే..!

Agia

Agia

శంషాబాద్ ఎయిర్‌పోర్టు సరికొత్త రికార్డ్ సృష్టించింది. మే నెలలో అత్యధిక స్థాయిలో ప్రయాణికులు ప్రయాణం చేశారు. గత నెలలో ఏకంగా 2.3 మిలియన్ల మంది ప్రయాణం చేసి రికార్డ్ సృష్టించారు. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ విడుదల చేసిన నెలవారీ నివేదిక ప్రకారం.. శంషాబాద్‌లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మే 2024లో 2.3 మిలియన్ల మంది ప్రయాణికులు ప్రయాణం చేసినట్లు తెలిపింది. అత్యధిక స్థాయిలో ప్రయాణం చేయడంతో సరికొత్త రికార్డ్ నమోదు చేసింది.

ఇది కూడా చదవండి: Damodar Raja Narasimha: జూడాలతో మంత్రి చర్చలు అసంపూర్ణం.. కొనసాగుతున్న సమ్మె

మే 18, 2024న అత్యధికంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 82,300 మంది ప్రయాణికులు ప్రయాణం చేసినట్లు తెలిపింది. ఈ ఏడాది ప్రయాణీకుల రద్దీ 11 శాతం పెరిగినట్లు తెలిపింది. ఇక దేశీయ ట్రాఫిక్ 10 శాతం పెరగగా.. అంతర్జాతీయ ట్రాఫిక్ 14 శాతం పెరిగిందని వెల్లడించింది. ఇక మే 4న 548 విమానాల రాకపోకలు జరిగాయి. ఇదిలా ఉంటే ఇటీవలే GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అవార్డులు వచ్చాయి. న్యూఢిల్లీలో జరిగిన ACREX హాల్ ఆఫ్ ఫేమ్ జాతీయ స్థాయి అవార్డులను గెలుచుకుంది.

ఇది కూడా చదవండి: IND vs AUS: భారత్, ఆసీస్ మ్యాచ్‌కు వర్షం ఎఫెక్ట్.. రద్దయితే ఆ జట్టుకు పండగే..!