NTV Telugu Site icon

Eluru Crime: పట్టపగలే నడిరోడ్డుపై భార్యను నరికి చంపిన భర్త

Knife Attack

Knife Attack

Eluru Crime: ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రామానుజపురం దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న భార్యను పట్టపగలే నడి రోడ్డుపై కత్తితో నరికిన హత్య చేశాడు భర్త. కుటుంబ కలహాల నేపథ్యంలో రాజనాల సూర్యచంద్రం తన భార్య సాయి లక్ష్మితో తరచు గొడవలు పడుతుండేవాడు. ఈరోజు మధ్యాహ్నం వ సమయంలో భార్యతో వాగ్వాదానికి దిగాడు. భార్యాభర్తల మధ్య మాటమాట పెరిగి గొడవ పెద్దది కావడంతో భార్య లక్ష్మి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఇదే సమయంలో మరింత కోపంతో భర్త సూర్యచంద్రం కత్తితో సాయిలక్ష్మి మెడపై నరికేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఘటన స్థలంలోనే లక్ష్మి ప్రాణాలు కోల్పోయింది. విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జరిగిన సమయంలో భర్త సూర్య సంద్రం మద్యం మత్తులో ఉన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

Read Also: Minister Satya Prasad: మదనపల్లె ఫైళ్ల దహనం ఘటనలో కుట్ర కోణం.. సీఐడీ విచారణలో తేలుస్తాం!