Humayun’s Tomb collapse: సమాధి చూడటానికి వెళ్తే.. ఢిల్లీలో ఘోరం.. శిథిలాల కింద ఎంత మంది ఉన్నారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Humayun’s Tomb collapse: దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని హుమాయున్ సమాధి ప్రాంగణంలో ఉన్న ఒక దర్గా పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో 10-12 మంది ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, రెస్క్యూ టీం సంఘటనా స్థలానికి చేరుకుని, అక్కడ సహాయ చర్యలు ముమ్మరం చేశారు.
READ MORE: Ambati Rambabu: సూపర్ సిక్స్, సూపర్ ప్లాప్.. చంద్రబాబుపై అంబటి ఫైర్
Also Read
దర్గా దగ్గర ప్రమాదం..
ఈ ప్రమాదం హుమాయున్ సమాధి వెనుక ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తుంది. హుమాయున్ సమాధి వెనుక ఉన్న దర్గా పైకప్పు కూలిపోయింది. ప్రమాదంలో శిథిలాల కింద10-12 మంది చిక్కుకున్నారని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అధికారులు చేపట్టిన రక్షణ చర్యల్లో 12 మందిని సురక్షితంగా తరలించారు.
అంతర్జాతీయ మీడియా సంస్థతో ఢిల్లీ అగ్నిమాపక దళ అధికారి ఒకరు మాట్లాడుతూ.. సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో గోపురంలోని ఒక భాగం కూలిపోతున్నట్లు సమాచారం అందిందని, ఆ తర్వాత సైనికులను సంఘటనా స్థలానికి పంపించాం. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా రాజధానిలో నిరంతరం కురుస్తున్న వర్షం కారణంగా ఈ పాత భవనం పైకప్పు కూలిపోయి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. శిథిలాల కింద సుమారుగా 8 నుంచి 10 వ్యక్తులు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నామని, ఐదు అగ్నిమాపక యంత్రాలను సంఘటనా స్థలానికి పంపినట్లు ఆయన తెలిపారు. 16వ శతాబ్దం మధ్యకాలం నాటి హుమాయున్ సమాధిని తరచుగా పర్యాటకులు సందర్శిస్తారు. ఈ ప్రమాదంలో కొంతమంది మరణించినట్లు కూడా నివేదికలు ఉన్నాయి.
READ MORE: JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటివి ఆపేస్తే బెటర్..?
తాజావార్తలు
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ బిగ్ షాక్.. హార్ముజ్ మళ్లీ మూసివేత
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవుట్..? తుది జట్టులో ఊహించని మార్పులు..
-
Good News : ఇక వాట్సాప్లోనే మార్కుల మెమో.. తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్.!
-
President Murmu AP Visit: విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము..
-
Team India: టైటిల్ పోరు ఖరారు.. జూన్ 21న ‘మహా సంగ్రామం’..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?