Humayun’s Tomb collapse: సమాధి చూడటానికి వెళ్తే.. ఢిల్లీలో ఘోరం.. శిథిలాల కింద ఎంత మంది ఉన్నారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Humayun’s Tomb collapse: దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని హుమాయున్ సమాధి ప్రాంగణంలో ఉన్న ఒక దర్గా పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో 10-12 మంది ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, రెస్క్యూ టీం సంఘటనా స్థలానికి చేరుకుని, అక్కడ సహాయ చర్యలు ముమ్మరం చేశారు.
READ MORE: Ambati Rambabu: సూపర్ సిక్స్, సూపర్ ప్లాప్.. చంద్రబాబుపై అంబటి ఫైర్
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
దర్గా దగ్గర ప్రమాదం..
ఈ ప్రమాదం హుమాయున్ సమాధి వెనుక ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తుంది. హుమాయున్ సమాధి వెనుక ఉన్న దర్గా పైకప్పు కూలిపోయింది. ప్రమాదంలో శిథిలాల కింద10-12 మంది చిక్కుకున్నారని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అధికారులు చేపట్టిన రక్షణ చర్యల్లో 12 మందిని సురక్షితంగా తరలించారు.
అంతర్జాతీయ మీడియా సంస్థతో ఢిల్లీ అగ్నిమాపక దళ అధికారి ఒకరు మాట్లాడుతూ.. సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో గోపురంలోని ఒక భాగం కూలిపోతున్నట్లు సమాచారం అందిందని, ఆ తర్వాత సైనికులను సంఘటనా స్థలానికి పంపించాం. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా రాజధానిలో నిరంతరం కురుస్తున్న వర్షం కారణంగా ఈ పాత భవనం పైకప్పు కూలిపోయి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. శిథిలాల కింద సుమారుగా 8 నుంచి 10 వ్యక్తులు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నామని, ఐదు అగ్నిమాపక యంత్రాలను సంఘటనా స్థలానికి పంపినట్లు ఆయన తెలిపారు. 16వ శతాబ్దం మధ్యకాలం నాటి హుమాయున్ సమాధిని తరచుగా పర్యాటకులు సందర్శిస్తారు. ఈ ప్రమాదంలో కొంతమంది మరణించినట్లు కూడా నివేదికలు ఉన్నాయి.
READ MORE: JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటివి ఆపేస్తే బెటర్..?
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!