Drugs: తెలంగాణలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. కీలక సూత్రదారి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో భారీగా మత్తు పదార్థాలను నార్కోటిక్ అధికారులు పట్టుకున్నారు. అయితే, తెలంగాణలో జోరుగా ఆల్ప్రాజోలం అనే డ్రగ్ విక్రయాలు కొనసాగుతున్నాయి. ఆల్ప్రా జోలం విక్రయాలపై ఇప్పటి వరకు 66 కేసులు నమోదు అయ్యాయి. ఒక్కో గ్రాము 10 వేల రూపాయలకు డ్రగ్స్ ముఠా అమ్మకాలు చేసింది. గడిచిన రెండేళ్లలో తెలంగాణలో 43 కేసులను టీఎస్ న్యాబ్ నమోదు చేసింది. ఇక, 3.14 కోట్ల రూపాయల విలువ చేసే ఆల్ప్రాజోలంను డీఆర్ఐ సీజ్ చేసినట్లు ప్రకటించారు. పరమేశ్వర కెమికల్స్ ఎండీ కిరణ్ కుమార్, లింగయ్య గౌడ్ నుంచి 70 కేజీల మత్తు పదార్థం స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ ముఠాలో గచ్చి బౌలికి చెందిన నరసింహ కీలక సూత్రధారిగా ఉన్నట్లు గుర్తించారు.
Read Also: MP Margani Bharat: అప్పుడు బందిపోటు.. ఇప్పుడెలా అవసరమయ్యారు?
Also Read
- HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
- Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
- NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
- Ayodhya Donation Theft Case: నిందితులకు షాక్.. వాదిస్తే రూ.5 లక్షల జరిమానా.. బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
అయితే, ఢిల్లీ నుంచి 34 కేజీల మత్తు పదార్థాలను నరసింహ తీసుకొచ్చినట్లు న్యాబ్ గుర్తించింది. ఆల్ప్రా జోలం డ్రగ్ ను పలు ఫ్యాక్టరీలలో తయారు చేస్తున్నట్లు గుర్తించారు. గత 25 ఏళ్లుగా డ్రగ్స్ ట్రాన్స్ పోర్ట్ లో నరసింహ గౌడ్ ఉన్నాడు.. ఢిల్లీ నుండి మెట్రో కొరియర్ సర్వీస్ లో మత్తు పదార్థాలు తరలింనట్లు గుర్తించారు.. వీటి కోసం నరసింహా హవాలా మార్గాన్ని ఎంచుకున్నాడని నార్కోటిక్ బ్యూరో తెలిపింది. కేజీ ఆల్ప్రా జోలం 2.4 లక్షల రూపాయలకు నరసింహా కొనుగోలు చేసి.. వాటిని హైదరాబాద్ లో 3.5 లక్షల రూపాయలకి అమ్మకాలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రతి నెల 40 కేజీలకు పైగా మత్తు పదార్థాలను అమ్ముతున్నట్లు వారు చెప్పారు. నర్సింహ గౌడ్ తో పాటు అతని కుమారుడు రాజశేఖర్ గౌడ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మత్తు పదార్థాల ద్వారా వచ్చిన డబ్బుతో భారీగా నరసింహ గౌడ్ కుటుంబ సభ్యులు ఆస్తులు కూడబెట్టారు.. ఇప్పటికే అతడిపై పలు కేసులు ఉన్నట్లు నార్కోటిక్ బ్యూరో అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
-
Smartphone Theft: ఫోన్ పోయిందా? మొదటి 15 నిమిషాల్లో ఈ పనులు చేయకపోతే డేటా, డబ్బు రెండూ పోవచ్చు
-
Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
-
Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
-
NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!