NTV Telugu Site icon

Andhra Pradesh: ఏపీలో ఆ ఉద్యోగులకు HRA పెంపు..

Ap Gov Logo

Ap Gov Logo

ఆంధ్రప్రదేశ్లో సెక్రటేరియట్, హెచ్వోడీలుగా పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి హెచ్ఆర్ఏ (HRA)ను పెంచింది. ప్రస్తుతం 16 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏను 24 శాతానికి పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బేసిక్ పేపై 24 శాతం హెచ్ఆర్ఏ పెంచారు. రూ.25 వేలకు మించకుండా పెంచిన హెచ్ఆర్ఏ వర్తింపజేయాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జూన్ వరకు పెంచిన హెచ్ఆర్ఏ అమలు చేయనున్నారు. ఈ మేరకు ఆర్థికశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.