Horse Gram Cultivation: ఉలవ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉలవలలో ఎన్నో పోషకాలు ఉంటాయి.. ఉలవ చారు, పప్పు, సలాడ్ లు చేసుకొని తింటారు.. వీటికి మార్కెట్ ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది.. అందుకే రైతులు కూడా ఉలవ పంటను సాగు చెయ్యడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.. మన రాష్ట్రంలో ఖరీఫ్ మొదటి పంట తరువాత వర్షాధారంగా లేదా ఏ పనులు వేయడానికి అనువుగా లేనప్పుడు ప్రత్యామ్నాయ పంటగా సాగు చేయవచ్చు.. ఉలవలు తొలకరి వేసిన వర్షాధార స్వల్పకాలిక పంటలైన పెసర , మినుము మరియు జొన్న, మొక్కజొన్న తదితర పంటల తర్వాత , లేటు ఖరిఫ్ లో ఉలవలు విత్తుకోవచ్చును.. ఈ పంటలో అంతర పంటలను కూడా వేసుకోవచ్చు..
ఇక భూమిని బాగా కలియ దున్నాలి..కల్టివేటరుతో ఒకసారి గొర్రు తోలి దుక్కి మెత్తగా తయారుచేసి విత్తుకోవాలి. నాగలి లేదా గోర్రుతో సాళ్ళ పద్ధతిలో సాళ్ళ మధ్య 30 సెం.మీ. ఎడంలో గింజలు సమంగా పడేటట్లు తగు పదనులో విత్తుకోవాలి. ప్రతి కిలో విత్తనానికి 1 గ్రా. కార్బండాజిమ్ లేదా థైరమ్ తో విత్తనశుద్ది చేసి విత్తుకోవాలి.. ఆ తర్వాత చివరి దుక్కిలో ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ముందు పంట మోళ్ళను రోటావేటర్ తో భూమిలో కలియ దున్నాలి. రైజోబియం కల్చర్ ను విత్తనానికి పట్టించి ఉపయోగించవలెను. 100 మి.లీ. నీటిలో 10 గ్రా. పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడెర్ ను కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లర్చాలి. అలా చల్లార్చిన ద్రావణం 8 కిలోల విత్తనాల పై చల్లి దానికి 200 గ్రా. రైజోబియం కల్చర్ పొడిని కలిపి బాగా కలియ బెట్టి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేటట్లు జాగ్రత్త వహించాలి.. ఇలా చేసిన విత్తనాన్ని నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి..
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
- Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ 'స్పైసీ చిల్లీ ఎగ్'.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
- Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
- TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
విత్తినాలు విత్తిన తొలి 30నుంచి 40 రోజుల వరకు కలుపు లేకుండా చూడాలి.. ఇక పంట కోత విషయానికొస్తే.. పూత, పిందే సమయంలో కాయ తొలుచు పురుగు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. వీటి నష్టపరిచే లక్షణాలు, అనుకూల వాతావరణ పరిస్థితులు, నివారణ చర్యలు పెసర, మినుములో సూచించిన విధంగా పాటించవలెను. పంట పరిపక్వత దశలో కాయలు ఆకుపచ్చ నుండి పసుపు రంగుకు మారి ఎండిపోవును.. ఇలా 80% ఎండిపోయిన తర్వాత మాత్రం పంటను కొయ్యాలి.. అప్పుడే నాణ్యమైన పంట చేతికి వస్తుంది.. ఇకపోతే కోసిన పంటను 3-4 రోజుల వరకు పంట చేనులో గాని లేదా కళ్లం పై ఎండనిచ్చి ఆ తర్వాత కర్రలతో కొట్టిగాని, పశువులతో తొక్కించి లేదా ట్రాక్టర్ తో తోక్కించి లేదా ఆల్ క్రాప్ త్రేషర్ ను ఉపయోగించి నూర్పిడి చేయాలి. నూర్పిడి చేసిన గింజలను బాగా శుభ్రపరచి 2-3 రోజులు ఎండనిచ్చి తేమ శాతాన్ని చూసి గోనె సంచులలో నిల్వ చెయ్యాలి.. వెంటనే మార్కెట్ చేస్తే మంచిది..
తాజావార్తలు
-
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
-
Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
ట్రెండింగ్
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?