China Pig: చైనాలో షాకింగ్ ఘటన… పంది పైనే అనుమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China Pig: చైనాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పందిని చంపేందుకు ప్రయత్నించిన కసాయి విగతజీవిగా మారాడు. తనను చంపేందుకు ప్రయత్నించిన కసాయిపై పెంపుడు పంది తిరగబడి దాడి చేసింది. ఎలక్ట్రిక్ గన్తో పడగొట్టిన తరువాత, పంది స్పృహలోకి వచ్చి కసాయిపై దాడి చేసింది. ప్రమాదంలో 61 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. హాంకాంగ్లోని ఓ కబేళాలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో షెయుంగ్ షుయ్ స్లాటర్హౌస్లో ఈ ప్రమాదం జరిగింది. కబేళాలో ఉపయోగించే పద్ధతి… ఎలక్ట్రిక్ గన్తో స్టన్ చేసి, ఆపై కత్తితో చంపడం. మరణించిన వృద్ధుడు కూడా ఇదే పద్ధతిని అనుసరించాడు. అతను ఎలక్ట్రిక్ స్టన్ గన్తో నుదుటిపై కాల్చి పందిని అపస్మారక స్థితిలో పడేశాడు.
Read Also: Arvind Dharmapuri : ప్రశాంత్ రెడ్డిపై ఎంపీ అరవింద్ తిట్లపురాణం
Also Read
- Bhojshala case: "భోజ్శాల ఒక దేవాలయం".. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
- Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
- 200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
కానీ పంది స్పృహలోకి వచ్చి అతని వైపు పరుగెత్తింది. అతని చేతిలోని సుమారు ఒకటిన్నర అడుగుల పొడవాటి కొడవలితో పందిని పొడిచాడు. కబేళాకు చెందిన మరో ఉద్యోగి వచ్చేసరికి అతని ఎడమ కాలికి కత్తి తగిలి ఉంది. ఆ కసాయి మైదానంలో అపస్మారక స్థితిలో కనిపించాడు.. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు. మృతికి గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదని, ఘటనపై కార్మిక శాఖ విచారణ ప్రారంభించిందని పోలీసులు తెలిపారు.
Read Also:Pawan Kalyan varahi : రేపు కొండగట్టుకు వారాహి.. పూజల అనంతరం రోడ్డెక్కనున్న వాహనం
మరణించిన కార్మికుడి కుటుంబాన్ని ఆదుకుంటామని కార్మిక శాఖ ప్రకటించింది. ఈ ఘటనపై త్వరలోనే విచారణ పూర్తి చేసి మృతికి గల కారణాలను వెలికితీస్తామని పోలీసులు తెలిపారు. పని పరిసరాల్లో ఉద్యోగుల భద్రతను పెంచాలని అధికారులను డిమాండ్ చేశారు కార్మికులు. లేబర్ డిపార్ట్మెంట్ కూడా భద్రతా లోపమా అనే కోణంలో దర్యాప్తు చేస్తోంది. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రపంచంలోని అతిపెద్ద మాంసం వినియోగదారులలో హాంకాంగ్ ఒకటి. హాంకాంగ్లు సగటు బ్రిటన్తో పోలిస్తే రోజుకు నాలుగు రెట్లు ఎక్కువ మాంసాన్ని తింటారని అంచనా. పంది మాంసం, గొడ్డు మాంసం హాంకాంగ్ ప్రజలకు ఇష్టమైన మాంసం వంటకాలు.
తాజావార్తలు
-
Bhojshala case: “భోజ్శాల ఒక దేవాలయం”.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
-
Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!