Bangladesh: హిందూ వ్యాపారి హత్య, డెడ్బాడీపై డ్యాన్స్ చేస్తూ పైశాచికం..
- బంగ్లాదేశ్లో హిందువులకు భద్రత కరువు..
- హిందూ వ్యాపారిపై మూక దాడి..
- డెడ్బాడీపై డ్యాన్స్ చేస్తూ పైశాచికం..
- దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమైన ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందూ వ్యతిరేకత, భారత్పై ద్వేషం రోజురోజుకు పెరుగుతోంది. గతేడాది ఆగస్టులో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారో, అప్పటి నుంచి ఆ దేశంలో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేస్తున్నారు. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం హిందువుల భద్రతను పట్టించుకోవడం లేదు. యూనస్ సర్కారులో మతోన్మాదులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, హిందువుల ఆస్తులు, వ్యాపారాలు, గుడులపై దాడులు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్లో ఓ స్క్రాప్ వ్యాపారి హత్య ఆ దేశంలో ఆగ్రహానికి కారణమైంది. వ్యాపారిని దారుణంగా కొట్టి చంపారు. అతను చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత, డెడ్బాడీపై డ్యాన్సులు చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారడం దేశ ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. ఈ దాడికి సంబంధించి ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఇతర నిందితుల కోసం ఆదివారం దేశవ్యాప్తంగా కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించబడిందని హోం వ్యవహారాల సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జహంగీర్ ఆలం చౌదరి తెలిపారు.
Also Read
Read Also: Ambati Rambabu: సైకోల్లా దాడులు చేస్తున్నారు.. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం..
జూలై 09న మిట్ఫోర్డ్ హాస్పిటల్ సమీపంలో లాల్ చంద్ అలియాస్ సోహాగ్ దారుణహత్యకు గురయ్యాడు. రాజధాని ఢాకాలో జరిగిన ఈ హత్య అనాగకరికమైందని చౌదరి అన్నారు. ఇతర నిందితులను పట్టుకునేందుకు బంగ్లా నిఘా ఏజెన్సీలు పనిచేస్తున్నాయి, వారికి ఏ రాజకీయ పార్టీలో సంబంధం ఉన్న వదిలిపెట్టేది లేదని ఆయన అన్నారు. మిట్ఫోర్డ్ హత్య కేసును స్పీడీ ట్రయల్ ట్రిబ్యునల్కు మార్చడానికి చర్యలు తీసుకున్నట్లు చౌదరి చెప్పారు.
గురువారం వైరల్ అయిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో, వ్యాపారిని కాంక్రీట్ ముక్కలతో కొట్టి చంపడం చూడొచ్చు. ఈ మూక హత్యలో పాల్గొన్నవారిలో కొందరిని అరెస్ట్ చేశారు. హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న టైటన్ గాజీ 5 రోజుల రిమాండ్లో ఉన్నారు. ఈ హత్య దేశంలో ఆగ్రహానికి కారణమైంది. శనివారం వందలాది మంది విద్యార్థులు మూక హింసను ప్రభుత్వం అరికట్టడంలో విఫలమైందని ఆరోపిస్తూ వీధుల్లోకి వచ్చారు. ఈ నెల ప్రారంభంలో ఇలాంటి మరో సంఘటనలో, సెంట్రల్ కుమిల్లాలోని మురాద్నగర్ ప్రాంతంలో మాదకద్రవ్యాల వ్యాపారంలో పాల్గొన్నారనే ఆరోపణలతో ఒక మహిళ మరియు ఆమె కుమారుడు మరియు కుమార్తెను కొట్టి చంపారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!