Extreme Cold: విపరీతమైన చలి బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Extreme Cold: విపరీతమైన చలి బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో కొనసాగుతున్న చలి కారణంగా బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ హెమరేజ్ కేసులు పెరుగుతున్నాయని, చలికాలంలో అధిక రక్తపోటు సాధారణమని సర్ గంగా రామ్ ఆసుపత్రి సీనియర్ న్యూరాలజిస్ట్ చెప్పారు. కొన్నిసార్లు బ్రెయిన్ స్ట్రోక్కి దారితీయవచ్చన్నారు.
అధిక రక్తపోటు ఉన్న రోగులలో బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పర్వత ప్రాంతాల్లోని ఎత్తైన ప్రదేశాల్లో ఆక్సిజన్ స్థాయిలు క్షీణించడం వల్ల ప్రమాదానికి గురవుతారని డాక్టర్ సీఎస్ అగర్వాల్ వెల్లడించారు. గాలి తక్కువగా ఉండే పర్వతాల వద్దకు వెళితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. రోజుల తరబడి సూర్యుడు రానప్పుడు ఇంట్లోనే ఉండడం వల్ల కూడా ఒత్తిడి పెరిగి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది.అందువల్ల ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉన్న ప్రదేశాలలో అదనపు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది” అని ఆయన అన్నారు.
Also Read
- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
- Rahul Gandhi: ప్రధాని ఇంటి ముందు ధర్నాకు రావాలి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి
- Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
- AAP: ప్రధాని నివాసం ముందు ధర్నా.. కాంగ్రెస్పై ఆప్ ఎదురుదాడి
అధిక రక్తపోటు ఉన్నవారికి బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ హెమరేజ్ ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని, తీవ్రమైన చలిలో రక్తపోటును అదుపులో ఉంచుకోవడం, వైద్యులతో సకాలంలో సంప్రదింపులు జరపడం అవసరమని సీనియర్ న్యూరాలజిస్ట్ సీఎస్ అగర్వాల్ వెల్లడించారు. చల్లని వాతావరణంలో రక్తపోటు తరచుగా పెరుగుతుంది. దీనితో పాటు, శీతాకాలంలో చెమట లేకపోవడం వల్ల, శరీరంలో సోడియం పరిమాణం పెరుగుతుంది, రక్తపోటు స్థాయిలను పెంచుతుందని అన్నారాయన. అనేక మంది బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్లు ఇటీవల కాన్పూర్లోని ఆసుపత్రులలో చేరారు. అందులో 14 ఏళ్ల చిన్నారి మరణించింది. విపరీతమైన చలి కారణంగా 14 ఏళ్ల బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Land Dispute: భగ్గుమన్న భూవివాదం.. పరస్పర కాల్పుల్లో ముగ్గురు దుర్మరణం
మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్, నిశ్చల జీవనశైలి, ఆక్సిజన్ లేకపోవడం, అలాగే అధిక ధూమపానం కూడా బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని డాక్టర్ చెప్పారు.రక్తపోటు మందులు వేసుకోవడానికి ప్రజలు భయపడుతున్నారని, వైద్యుల సలహా తీసుకోకుండా మందులు కూడా మానేస్తున్నారని అన్నారు. చలికాలంలో విటమిన్ డి మాత్రలు వేసుకోవడం మంచిదని, మార్నింగ్ వాక్లకు వెళ్లకూడదన్నారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
-
Rahul Gandhi: ప్రధాని ఇంటి ముందు ధర్నాకు రావాలి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి
-
El Nino : ఎల్నీనో ఎఫెక్ట్.. తెలంగాణలో డ్రౌట్ అలర్ట్.!
-
Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
-
Ajay Bhupathi: ‘మంగళవారం’లో హీరోయిన్ పాయల్ రాజ్ఫుత్ క్యారెక్టర్పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!