Huzurabad: హుజూరాబాద్ లో హైటెన్షన్.. నేతల హౌస్ అరెస్ట్.. కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్
- హుజూరాబాద్లో ఒక్కసారిగా హీటెక్కిన రాజకీయం
- ఎమ్మేల్యే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి ప్రణవ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు
- రాత్రికి రాత్రే కౌశిక్ రెడ్డి ఉద్యమ ద్రోహి అని.. మానుకోటలో రాళ్ళు విసిరిన ద్రోహి అంటూ పోస్టర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ – బీఆర్ఎస్ నాయకుల సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య రాజకీయం ఒక్కసారిగా హిటెక్కింది. చెల్పూర్ హనుమాన్ ఆలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఎమ్మేల్యే కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి ప్రణవ్ ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కాగా మంగళ వారం ఉదయం గుడి వద్ద ప్రమాణం చేయాలి అని ఛాలెంజ్ చేసుకుని సిద్ధపడ్డ తరుణంలో రాత్రికి రాత్రే కౌశిక్ రెడ్డి ఉద్యమ ద్రోహి అని, మానుకోటలో రాళ్ళు విసిరిన ద్రోహి అంటూ పోస్టర్లు వెలువడం చర్చనీయాంశంగా మారింది.
READ MORE: AAY : ఎన్టీఆర్ బావమరిది రెండో సినిమా ‘ఆయ్’.. రిలీజ్ డేట్ ఫిక్స్
Also Read
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
- FIFA World Cup Final: ఏంటి.. ఒక్క టికెట్ ధర రూ.11 లక్షలా.? చరిత్రలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్..!
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజక వర్గంలో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్య వార్ కొనసాగుతుంది. హుజూరాబాద్ నియోజకవర్గం మీదుగా ఖమ్మంకు ఫ్లై యాష్ అధికలోడుతో వే బిల్లులు లేకుండా మంత్రి పొన్నం అండదండల మంత్రి కోట్లు సంపాది స్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కేవలం పబ్లిసిటీ కోసం మంత్రి పొన్నం పై ఆరోపణలు చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ఎమ్మేల్యే కాకముందు ఉద్యోగులు ఇప్పిస్తానని లక్షలు వసూలు చేశారని తాజాగా హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి తీవ్ర వ్యాఖ్యాలు చేశారు. చెల్పూర్ హనుమాన్ ఆలయం వద్ద సాక్ష్యాలతో నిరూపిస్తానని కౌశిక్ రెడ్డి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. సవాల్ ను స్వీకరించిన కౌశిక్ రెడ్డి తాను కూడా వస్తానని ప్రకటన చేశారు. దీంతో అలార్ట్ అయిన పోలీసులు చెల్పూర్ లో ఏర్పాటు చేసిన టెంట్ ఫ్లెక్సీలను తొలగించి ఎమ్మేల్యే కౌశిక్ రెడ్డి. ప్రణవ్ ఇంటి వద్ద భారీగా చేరుకున్నారు.
READ MORE: Ponnam Prabhakar: ఆషాఢ మాసం బోనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. అన్ని సదుపాయాలకు రూ.20కోట్లు
వాళ్ళను హౌస్ అరెస్ట్ చేశారు. ఆలయం వద్దకు వచ్చేందుకు యత్నించిన ఇరు పార్టీల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో స్వల్ప లాఠీ ఛార్జ్ చేశారు. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్కు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన సవాల్ విసిరారు. తడి బట్టలతో తాను అవినీతి చేయలేదని కౌశిక్ రెడ్డి ప్రమాణం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రూ.100 కోట్ల అవినీతి చేయలేదని ప్రమాణం చేయాలన్నారు. తాను అవినీతి చేయలేదని దేవుడిపై ప్రమాణం చేస్తానని కౌశిక్ రెడ్డి అన్నారు. ఫ్లైయాష్తో పాటు ఓవర్ లోడ్ లారీలను ఎందుకు ఆపడం లేదన్నారు.
తాజావార్తలు
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
-
Namitha: గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న అభిమానులు!
-
RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?