CS Somesh : మీరు ఏం చేస్తున్నారు.. సీఎస్ సోమేశ్ కుమార్కు హైకోర్టు సమన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బషీర్బాగ్లోని హిల్ ఫోర్ట్ ప్యాలెస్ పునరుద్ధరణకు సంబంధించి పదేపదే హామీలు ఇవ్వడంతో విసుగు చెందిన తెలంగాణ హైకోర్టు శుక్రవారం డిసెంబర్ 23న తమ ముందు హాజరు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను ఆదేశించింది. వారసత్వ నిర్మాణం యొక్క గత వైభవాన్ని కనీసం పునరుద్ధరించడానికి రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను వివరించాలని సోమేశ్ కుమార్ను కోరింది. ప్యాలెస్ను పునరుద్ధరించాలని కోరుతూ హైదరాబాద్ హెరిటేజ్ ట్రస్ట్కు చెందిన దీపక్ కాంత్ గిర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించింది.
హెరిటేజ్ నిర్మాణంలో పునరుద్ధరణ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని గతంలో ఐదు నుంచి ఆరు సార్లు విచారణ జరిపిన టూరిజం అధికారులు కోర్టుకు తెలియజేసినా ఆ పనిని అమలు చేయలేదు. ఈ కేసును అనుసరించి ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సివి భాస్కర్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ప్రతిష్టాత్మకమైన వారసత్వ భవనాన్ని పరిరక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారిస్తూ, ఈ విషయంలో సంబంధిత అధికారుల ప్రతిస్పందనను తీవ్రంగా పరిగణించింది.
Also Read
- Indian Railway: ఇండియన్ రైల్వేలో సరికొత్త విప్లవం.. టెక్నాలజీ వాడకంలో భారత్ నెక్స్ట్ లెవెల్..
- Modi-Trump: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం వేగం.. ఏఐ రంగంలో సహకారానికి రెడీ
- India - Iran Talks: ఇరాన్ నుంచి చమురు దిగుమతులపై కీలక చర్చలు.. భారత్ తదుపరి అడుగు ఏంటి?
- Off The Record: తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందా..?
హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ విభాగాల అధికారులను పిలిపించి ‘రెడీమేడ్ స్టేట్మెంట్లు’ విన్న తర్వాత బెంచ్ హామీలపై అనుమానాలు పెంచింది. పునరుద్ధరణ కోసం రాష్ట్రం 50 కోట్లు కేటాయించిందన్న హామీ నిజమా కాదా అనేది ఇప్పుడు అనుమానంగా ఉందని ధర్మాసనం పేర్కొంది.
పునరుద్ధరణపై బ్లూప్రింట్ కోసం బెంచ్ కోరినప్పటికీ, టూరిజం కార్పొరేషన్ ఇచ్చిన మెకానికల్ నివేదికతో అది కలత చెందింది. “హెరిటేజ్ నిర్మాణాన్ని శుభ్రం చేస్తున్న కార్పొరేషన్ సిబ్బంది యొక్క స్టిల్ ఫోటోలు అధికారులు మా ఆర్డర్ను అమలు చేస్తున్నారనే నమ్మకం కలిగించే చర్య” అని పేర్కొంది. అయితే.. వాదనలు విన్న హైకోర్టు దీంతో.. రవాణా, రహదారులు, భవనాల శాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు, యువజనాభివృద్ధి, పర్యాటకం, సాంస్కృతిక శాఖ ఇన్చార్జి కార్యదర్శి టీకే శ్రీదేవి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, అరవింద్ కుమార్ కోర్టుకు హాజరు కావాలి ధర్మాసనం ఆదేశించింది.
తాజావార్తలు
-
Indian Railway: ఇండియన్ రైల్వేలో సరికొత్త విప్లవం.. టెక్నాలజీ వాడకంలో భారత్ నెక్స్ట్ లెవెల్..
-
Modi-Trump: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం వేగం.. ఏఐ రంగంలో సహకారానికి రెడీ
-
India – Iran Talks: ఇరాన్ నుంచి చమురు దిగుమతులపై కీలక చర్చలు.. భారత్ తదుపరి అడుగు ఏంటి?
-
Off The Record: తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందా..?
-
CM Revanth Reddy : RDS నీళ్లపై తెలంగాణ మాస్టర్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!