CS Somesh : మీరు ఏం చేస్తున్నారు.. సీఎస్ సోమేశ్ కుమార్కు హైకోర్టు సమన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బషీర్బాగ్లోని హిల్ ఫోర్ట్ ప్యాలెస్ పునరుద్ధరణకు సంబంధించి పదేపదే హామీలు ఇవ్వడంతో విసుగు చెందిన తెలంగాణ హైకోర్టు శుక్రవారం డిసెంబర్ 23న తమ ముందు హాజరు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను ఆదేశించింది. వారసత్వ నిర్మాణం యొక్క గత వైభవాన్ని కనీసం పునరుద్ధరించడానికి రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను వివరించాలని సోమేశ్ కుమార్ను కోరింది. ప్యాలెస్ను పునరుద్ధరించాలని కోరుతూ హైదరాబాద్ హెరిటేజ్ ట్రస్ట్కు చెందిన దీపక్ కాంత్ గిర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించింది.
హెరిటేజ్ నిర్మాణంలో పునరుద్ధరణ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని గతంలో ఐదు నుంచి ఆరు సార్లు విచారణ జరిపిన టూరిజం అధికారులు కోర్టుకు తెలియజేసినా ఆ పనిని అమలు చేయలేదు. ఈ కేసును అనుసరించి ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సివి భాస్కర్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ప్రతిష్టాత్మకమైన వారసత్వ భవనాన్ని పరిరక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారిస్తూ, ఈ విషయంలో సంబంధిత అధికారుల ప్రతిస్పందనను తీవ్రంగా పరిగణించింది.
Also Read
- Sugar Prices: చక్కెర ధరలపై గుడ్న్యూస్.. దిగిరానున్న ధరలు
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
- IND vs SL 2nd Test: కొలంబో టెస్ట్లో భారత్ డిక్లేర్.. శ్రీలంక ముందు భారీ టార్గెట్..
- Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ విభాగాల అధికారులను పిలిపించి ‘రెడీమేడ్ స్టేట్మెంట్లు’ విన్న తర్వాత బెంచ్ హామీలపై అనుమానాలు పెంచింది. పునరుద్ధరణ కోసం రాష్ట్రం 50 కోట్లు కేటాయించిందన్న హామీ నిజమా కాదా అనేది ఇప్పుడు అనుమానంగా ఉందని ధర్మాసనం పేర్కొంది.
పునరుద్ధరణపై బ్లూప్రింట్ కోసం బెంచ్ కోరినప్పటికీ, టూరిజం కార్పొరేషన్ ఇచ్చిన మెకానికల్ నివేదికతో అది కలత చెందింది. “హెరిటేజ్ నిర్మాణాన్ని శుభ్రం చేస్తున్న కార్పొరేషన్ సిబ్బంది యొక్క స్టిల్ ఫోటోలు అధికారులు మా ఆర్డర్ను అమలు చేస్తున్నారనే నమ్మకం కలిగించే చర్య” అని పేర్కొంది. అయితే.. వాదనలు విన్న హైకోర్టు దీంతో.. రవాణా, రహదారులు, భవనాల శాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు, యువజనాభివృద్ధి, పర్యాటకం, సాంస్కృతిక శాఖ ఇన్చార్జి కార్యదర్శి టీకే శ్రీదేవి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, అరవింద్ కుమార్ కోర్టుకు హాజరు కావాలి ధర్మాసనం ఆదేశించింది.
తాజావార్తలు
-
Marriage Rumours: జయరామ్ – సిమ్రాన్ పెళ్లి చేసుకున్నారా? వైరల్ అవుతున్న ఫొటోలు!
-
Sugar Prices: చక్కెర ధరలపై గుడ్న్యూస్.. దిగిరానున్న ధరలు
-
CM Revanth Reddy : కొండా సురేఖ ఎపిసోడ్పై రేవంత్ క్లారిటీ.. కీలక వ్యాఖ్యలు..
-
Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
-
IND vs SL 2nd Test: కొలంబో టెస్ట్లో భారత్ డిక్లేర్.. శ్రీలంక ముందు భారీ టార్గెట్..
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!