Hezbollah Commander Hassan: తొలిసారి కెమెరా ముందుకు హిజ్బుల్లా కమాండర్.. ఇజ్రాయెల్కు డెడ్లీ వార్నింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hezbollah Commander Hassan: పశ్చిమాసియా యుద్ధ క్షేత్రంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ సైన్యంతో హోరాహోరీగా పోరాడుతున్న హిజ్బుల్లా సంస్థకు చెందిన కీలక కమాండర్ హసన్ తొలిసారిగా అంతర్జాతీయ టెలివిజన్ ముందుకు వచ్చి సంచలన ప్రకటనలు చేశారు. గత 15 నెలలుగా తమ యోధులు ఈ యుద్ధం కోసమే ఎదురుచూస్తున్నారని, తమ భూభాగాన్ని కాపాడుకోవడానికి ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు.
READ ALSO: కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!
Also Read
- TDP Mahanadu: మహానాడులో చంద్రబాబు కీలక తీర్మానం.. ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలి..
- Hyderabad Ropeway: హైదరాబాద్లో ఆకాశ మార్గ ప్రయాణం.. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్గా రోప్వేలకు భారీ ప్రణాళిక.!
- Siddaramaiah: "నేను మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నా.. నాకు ఎలాంటి బాధ లేదు".. సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు..
- Karnataka Politics: సీఎం ఇంట్లో ఎమోషనల్ సీన్.. సిద్ధరామయ్య కాళ్లకు మొక్కిన డీకే శివకుమార్..
4,000 దాడులు.. 500 మంది మరణం
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ తుంగలో తొక్కిందని హసన్ ఆరోపించారు. “కాల్పుల విరమణ సమయంలో కూడా ఇజ్రాయెల్ సుమారు 4,000 దాడులు చేసింది. ఇళ్లు, రోడ్లు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే కాకుండా 500 మంది పౌరులను పొట్టనబెట్టుకుంది. అందుకే మా పోరాటం ఆగదు” అని ఆయన స్పష్టం చేశారు. దక్షిణ లెబనాన్ ప్రజలను రక్షించడమే తమ ఏకైక లక్ష్యమని, అక్కడ ప్రతి ఒక్కరూ హిజ్బుల్లా వారేనని ఆయన వ్యాఖ్యానించారు. యుద్ధ క్షేత్రంలో సాధించిన విజయాలను హసన్ ఈ సందర్భంగా వివరించారు. కేవలం 25 రోజుల పోరాటంలో 119 ఇజ్రాయెల్ మెర్కావా ట్యాంకులను, సాయుధ వాహనాలను ధ్వంసం చేశామని వెల్లడించారు. అలాగే ఉత్తర ఇజ్రాయెల్లోని 20 కీలక సైనిక స్థావరాలపై దాడులు చేశామని చెప్పారు. వ్యూహాత్మక ప్రాంతమైన లిటాని నదిని చేరుకోకుండా ఇజ్రాయెల్ బలగాలను విజయవంతంగా అడ్డుకుంటున్నామని హసన్ పేర్కొన్నారు.
ఇరాన్ మద్దతుపై ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇరాన్ నుంచి అందుతున్న ఆయుధ సరఫరా గురించి మాట్లాడుతూ.. “ఆయుధాల గురించి యుద్ధభూమియే సమాధానం ఇస్తుంది” అంటూ హసన్ నేరుగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. అయితే, 1982లో తమ సంస్థ ఏర్పడినప్పటి నుంచి లెబనీస్ ప్రజలను కాపాడటానికి ఇరాన్ మద్దతు ఇస్తోందని, కానీ తమ అసలైన బలం స్థానిక ప్రజల మద్దతులోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే దాని గురించి మాట్లాడుతూ.. “ఈ యుద్ధానికి కాలపరిమితి లేదు. మా యోధులు పోరాడకపోతే ఇజ్రాయెల్ మమ్మల్ని నిర్మూలిస్తుంది. అందుకే మా చివరి శ్వాస వరకు పోరాటం సాగుతుంది” అని తేల్చి చెప్పారు.
READ ALSO: Varun Tej Bari: బాబాయ్ బ్లెస్సింగ్స్తో ‘బరి’లోకి దిగిన వరుణ్ తేజ్!
తాజావార్తలు
-
Suriya : ఆగస్టు 14న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్ ఫిక్స్
-
TDP Mahanadu: మహానాడులో చంద్రబాబు కీలక తీర్మానం.. ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలి..
-
Hyderabad Ropeway: హైదరాబాద్లో ఆకాశ మార్గ ప్రయాణం.. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్గా రోప్వేలకు భారీ ప్రణాళిక.!
-
Karnataka Power Tussle: సీఎం పదవి నుంచి దిగిపోయేలా సిద్ధరామయ్యను కాంగ్రెస్ హైకమాండ్ ఎలా ఒప్పించింది?
-
Siddaramaiah: “నేను మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నా.. నాకు ఎలాంటి బాధ లేదు”.. సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!