Site icon NTV Telugu

YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన.. నాలుగు రోజుల షెడ్యూల్ ఇదే!

Ys Jagan

Ys Jagan

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పులివెందులలో పర్యటించనున్నారు. మంగళవారం (డిసెంబర్ 24) నుంచి నాలుగు రోజుల పాటు (డిసెంబర్ 27) సొంత నియోజవర్గంలో జగన్‌ పర్యటిస్తారు. ఈ మేరకు పార్టీ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. రేపు ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకుని.. దివంగత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఘాట్‌ వద్ద నివాళులర్పించిన అనంతరం టూర్ మొదలవుతుంది. ఈ నెల 27న సాయంత్రం తిరిగి బెంగళూరుకు వెళ్ళిపోతారు.

24 షెడ్యూల్‌:
వైఎస్‌ జగన్‌ మంగళవారం ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకుని దివంగత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఘాట్‌ వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ప్రేయర్‌ హాల్‌లో జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత కడప నియోజకవర్గ నాయకులతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు ఇడుపులపాయ నుంచి పులివెందుల బయలుదేరి వెళ్లి రాత్రికి అక్కడ నివాసంలో బస చేస్తారు.

25 షెడ్యూల్‌:
ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్‌ సందర్భంగా సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్‌ వేడుకల్లో వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు తాతిరెడ్డిపల్లిలో రామాలయాన్ని ప్రారంభించి.. పులివెందుల చేరుకుని రాత్రికి బస చేస్తారు.

Also Read: PDS Ration Scam: డబ్బులు కడితే పేర్ని నాని దొర అవుతాడా?.. తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు!

26 షెడ్యూల్‌:
పులివెందుల క్యాంప్‌ ఆఫీస్‌లో వైఎస్‌ జగన్‌ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజాదర్భార్‌ నిర్వహిస్తారు.

27 షెడ్యూల్‌:
ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్‌లో జరగనున్న వివాహానికి వైఎస్‌ జగన్‌ హాజరవుతారు. అనంతరం బయలుదేరి బెంగళూరు వెళతారు.

Exit mobile version