Srisailam Traffic Jam: శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. రాత్రంతా జాగరణ ఉన్న భక్తులు ఉదయం శివుడిని దర్శించుకున్నారు. ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శ్రీశైలం టోల్ గేట్ నుంచి ముఖద్వారం వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై కార్లలో బస్సులలో సొంత వాహనాలలో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శ్రీశైలం నుంచి ఎటు చూసినా రోడ్లపై కార్లు బస్సులు ఆటోలు జీపులు అడ్డదిడ్డంగా నిలిపివేశారు. దీంతో శ్రీశైలం సమీపంలో రామయ్య టర్నింగ్ వద్ద పోలీసు వాహనాలకు కూడా సందు లేకుండా పూర్తిగా రోడ్లపై వాహనాలు నిలిచిపోవడంతో శ్రీశైలం వచ్చే భక్తులు వెళ్లే భక్తులు రోడ్లపై ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయారు.
భక్తులు తమ వాహనాలు ఎటూ పోలేక ఆందోళన చెందుతున్నారు. నిన్న మహాశివరాత్రి పర్వదినం కావడంతో శ్రీశైలానికి లక్షలాదిగా భక్తులు సొంత కార్లలో బస్సులలో తండోపతండాలుగా క్షేత్రానికి తరలివచ్చార. మహాశివరాత్రి పర్వదినం ముగియడంతో శ్రీస్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం భక్తులు సొంత ఊర్లకు బయలు దేరారు. నిన్నటి వరకు పోలీసులు ట్రాఫిక్ జామ్ కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నప్పటికీ ఇవాళ భక్తులు తిరుగు ప్రయాణంలో ట్రాఫిక్ పూర్తిస్థాయిలో పెరిగిపోయింది. రోడ్లన్నీ కార్లు, బస్సులు, జీపులు, ఆటోలతో నిండిపోయింది.
Also Read
- Abhishek Sharma: అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్.. అసలు ఏం జరిగిందంటే..?
- IND vs ENG 1st ODI: టీ20 పరాభవానికి ప్రతీకారం.. ఇట్స్ రివెంజ్ టైం.! నేడు తొలి వన్డే ప్లేయింగ్ XI ఇదే..
- ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
- Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు
శ్రీశైలం నుంచి ఇటు కర్నూలు- గుంటూరు రోడ్డులో భారీ వాహనాల రద్దీ పెరిగింది. అటు హైద్రాబాద్ రోడ్టులో కూడా వాహనాల రద్దీ బాగా పెరిగింది. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ పెరిగింది. సుమారు మూడు గంటల నుంచి భక్తులు రోడ్లపై ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి పడిగాపులు పడుతున్నారు. ఓ పక్క ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ జామ్ లో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికి ట్రాఫిక్ కంట్రోల్ చేయలేని పరిస్థితి కనబడుతుంది. శ్రీశైలం ఘాట్ రోడ్ లో సుమారు ఐదు కిలోమీటర్ల మేర రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. సాయంత్రానికి పరిస్థితి అదుపులోకి రావచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Read Also: MLA G Sayanna : ఎమ్మెల్యే సాయన్న మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం
తాజావార్తలు
-
Bollywood : భారీ ధరకు 25 ఎకరాల భూమి కొనుగోలు చేసిన స్టార్ హీరో
-
Tollywood : టాలీవుడ్కు ఒక గట్టి గుణపాఠం నేర్పిన మా ఇంటి బంగారం, లెనిన్
-
Abhishek Sharma: అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Prithviraj Sukumaran: ఇతర భాషల్లో క్రేజ్… మాలీవుడ్లో తగ్గుతున్న పృథ్వీరాజ్ జోరు?
-
IND vs ENG 1st ODI: టీ20 పరాభవానికి ప్రతీకారం.. ఇట్స్ రివెంజ్ టైం.! నేడు తొలి వన్డే ప్లేయింగ్ XI ఇదే..
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!