Heavy Rains: నేడు భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ! అస్సలు బయటకు రావొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Red Alert issued for Next Two Days in Hyderabad: రానున్న 24 గంటల్లో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అవసరం అయితేనే బయటికి రావాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా వాయుగుండం ప్రభావంతో బుధ, గురు వారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
గత వారం రోజులుగా హైదరాబాద్ (Hyderabad Rains) నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ప్రతిరోజు చిన్న చిన్న బ్రేక్లు ఇచ్చి.. వర్షం దంచి కొడుతోంది. కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు అన్ని ఇప్పటికే జలమయం అయ్యాయి. డ్రైనేజీలు కూడా పొంగిపొర్లుతున్నాయి. రోజూ కురుస్తున్న వర్షపు నీటితో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దాంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా వాహనదారులు గంటల తరబడి టాఫిక్లో చిక్కుకుపోతున్నారు.
Also Read
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
Also Read: Gold Today Price: బంగారం ప్రియులకు గుడ్న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు!
ఇక బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జోన్ల వారీగా హెచ్చరికలు జారీ చేసింది. చార్మినార్ జోన్, ఎల్బీనగర్ జోన్, ఖైరతాబాద్ జోన్, శేరిలింగంపల్లి జోన్ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కూకట్పల్లి జోన్కు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఈ జోన్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటలో 3 నుంచి 5 సెంమీ వర్షం కురిసే సూచనలున్నాయని, 10 సెంమీ. కూడా కురావొచ్చని వెల్లడించింది. గంటకు 10 నుంచి 14 కిమీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
భారీ నుంచి అతి భారీ వర్షంతో రహదారులన్నీ జలమయమవుతాయి కాబట్టి నగరంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు గాలులతో చెట్లు నేలకూలే ప్రమాదం, విద్యుత్తు స్తంభాలు దెబ్బతినడం, కరెంటు సరఫరాలో అంతరాయాలకు అవకాశం, చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Also Read: Parliament: నేడు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం!.. లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!