Uttar Pradesh: యూపీలో భారీ వర్షాలు.. ఇబ్బంది పడుతున్న 50 వేల మందికి పైగా జనం
Heavy Rains in Uttar Pradesh: దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా వానలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా వరుస వర్షాలు కురవడంతో వాతావరణ శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక ఉత్తరప్రదేశ్ లో అయితే ఈ వరదలు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఆదివారం మొదలు సోమవారం తెల్లవారు జాము వరుకు ఆగకుండా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఇక ఇలాంటి పరిస్థితే మరో నాలుగురోజులు పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. భారీ వర్షాల కారణంగా ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతుంది.
Also Read: Matsya 6000: సముద్రయాన్..మరో ఘనత సాధించడానికి సిద్ధమవుతున్న భారత్
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
ఒక్కరోజు వ్యవధిలోనే 19 మంది ఈ వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పొయారు. పలు పాంత్రాల్లో ఇళ్ల పై కప్పులు కూలిపోయాయి. దీని కారంణగా ఇద్దరు చనిపోయారు. మరణించిన వారు సోదరులు కాగా వారి వయసు ఒకరిది 17 సంవత్సరాలు, ఒకరిది 13 సంవత్సరాలు. అంతేకాకుండా వర్షాల కారణంగా చెరువులలో కూడా నీటి మట్టం పెరిగింది. దేవరియాలో 9 ఏళ్ల బాలిక చెరువు వద్ద స్నానం చేస్తూ వరద నీటిలో కొట్టుకుపోయింది. కొన్ని చోట్లు పశువులు చనిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో ఏకంగా 140 గొర్రెలు బలైపోయాయి. వీటికి తోడు పిడుగులు పడి కూడా జనం, పశువులు మరణిస్తున్నారు.
రాష్ట్రంలో లఖ్నవూతోపాటు బారాబంకీ, ప్రతాప్గఢ్, కన్నౌజ్, ముజఫర్నగర్ సహా 22 జిల్లాల్లో 24 గంటల్లో 40 మి.మీ.కుపైగా వర్షాలు కురిశాయి. సుమారు 173 గ్రామాలు ఈ వరదల కారణంగా ప్రభావితం అవుతున్నాయి. 56 వేల మంది వరద నీటితో ఇబ్బందులు పడుతున్నారు. చివరికి ఉత్తరప్రదేశ్ లో వర్షాల కారణంగా రైల్వే స్టేషన్ లు కూడా మునిగిపోయాయి. బారాబంకీలో వర్షాలకు రైలు పట్టాలు నీటమునిగాయి. దీంతో రైళ్ల ప్రయాణాలకు ఆటంకం కలగకుండా రైళ్లను తక్కువ వేగంతో నడుపుతున్నారు. మరో మూడు నాలుగు రోజుల పాటు ఉత్తరప్రదేశ్ లో ఇదే విధంగా వరదలు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సూళ్లకు కూడా సెలవులు ప్రకటించారు.
- Tags
- Heavy rains
- Uttar Pradesh
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!