Site icon NTV Telugu

CM Revanth Reddy: దంచి కొడుతున్న వర్షం.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: హైదరాబాద్​ నగర ప్రజలను వర్షాలు వదలడం లేదు. ఇటీవల కురిసిన కుంభవృష్టి నుంచి తేరుకోకముందే బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో జీహెచ్​ఎంసీ పరిధిలో కుండపోత వర్షం పడింది. మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం సుమారు 4 గంటలుగా కురుస్తోంది. ఎల్బీనగర్​, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో రోడ్లు మునిగిపోయాయి. వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దాదాపు జంట నగరాల్లోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. హయత్ నగర్, వనస్థలిపురంలోని రైన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది.. లోతట్టు ప్రాంతాలు అక్కడే ఉన్నాయి.. చాలా కాలనీలు నీట మునిగాయి.. ఈ నేపథ్యలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

READ MORE: Dogs: వీధి కుక్కలు ఎందుకు వెంటపడతాయి..? తప్పించుకోవాలంటే ఏం చేయాలి?

హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వ‌ర్షాల నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్రమ‌త్తంగా ఉండాల‌ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. పురాత‌న ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. హైద‌రాబాద్‌లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్‌, అగ్నిమాప‌క‌, ట్రాఫిక్, పోలీసు సిబ్బంది స‌మ‌న్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు త‌లెత్తకుండా చూడాల‌ని సీఎం సూచించారు. వాగులపై ఉన్న లోత‌ట్టు కాజ్‌వేలు, క‌ల్వర్టుల‌పై నుంచి నీటి ప్రవాహాలపైన అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చెరువులు, కుంటలకు గండి ప‌డే ప్రమాదం ఉన్నందున నీటి పారుద‌ల శాఖ అధికారులు ముందు జాగ్రత్త చ‌ర్యలు తీసుకోవాల‌ని సూచించారు.

READ MORE: Gold Alert: అలర్ట్.. పసిడి మెరుగులు పైపైనేనా.. ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేయండి

Exit mobile version