హైదరాబాద్లోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కార్యాలయం ముందు భారీగా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. అంతేకాకుండా.. పెద్ద ఎత్తున పోలీసు వాహనాలు మోహరించాయి. గ్రూప్-1, గ్రూప్- 2, గ్రూప్- 3 ఫలితాలు విడుదల అయిన నేపథ్యంలో నిరసనలు జరుగుతాయామోనని ముందస్తుగా పోలీస్ బందోబస్తు ఉన్నారు. కాగా.. గ్రూప్-1 ఫలితాలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో టీజీపీఎస్సీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలోనే టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద పకడ్బందీగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Read Also: BRS: శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన..
కాగా.. గ్రూప్ -1, గ్రూప్- 2, గ్రూప్- 3 ఫలితాలు విడుదల అయిన సంగతి తెలిసిందే.. గ్రూప్ 3 ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాలు విడుదల చేసింది. డిసెంబర్ 2022 లో 1388 పోస్ట్ భర్తీకి గ్రూప్ -3 నోటిఫికేషన్ విడుదలవగా.. 5 లక్షల 36 వేల 400 మంది దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్ 17,18 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. 2 లక్షల 69 వేల 483 మంది (50.24 శాతం) పరీక్ష రాశారు.గ్రూప్-2లో మొత్తం 783 పోస్ట్ల భర్తీకి 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు. గత డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 2 లక్షల 51 వేల 738 (45.57 శాతం) మంది హాజరు అయ్యారు. అంతకుముందు గ్రూప్-1 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ద్వారా మొత్తం 563 ఖాళీలను భర్తీ చేశారు.
Read Also: Jammu and Kashmir: ఏప్రిల్ 1 నుంచి మహిళలకు ఉచితంగా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణం