Principal Arrest : విద్యార్థులతో ఆ పని చేయిస్తున్న ప్రిన్సిపల్ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Principal Arrest : విద్యార్థులతో ఏడాదిగా టాయిలెట్లు శుభ్రం చేయిస్తున్న హెడ్ మాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని పాలక్కరై పంచాయతీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టాయిలెట్లను శుభ్రం చేసేందుకు షెడ్యూల్డ్ కులాల విద్యార్థులను తయారు చేసిన కేసులో పరారీలో ఉన్న ప్రధాన ఉపాధ్యాయురాలని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఈరోడ్ జిల్లా పెరుందురై సమీపంలోని బాలకరైలో ప్రభుత్వ పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాల ఉంది. మండలానికి చెందిన 35 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. ఈ పాఠశాలలో 2 మరుగుదొడ్లు ఉన్నాయి. ఒకటి ఉపాధ్యాయుల కోసం కాగా మరొకటి విద్యార్థులు ఉపయోగిస్తారు. ఈ క్రమంలో పాఠశాలలో చదువుతున్న కొందరు విద్యార్థులు అనారోగ్య సమస్యల కారణంగా కొంత కాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Read Also: Jabalpur: డ్రైవర్కు హార్ట్ ఎటాక్.. సిగ్నల్ దగ్గర వాహనాలపైకి దూసుకెళ్లిన బస్సు
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
చిన్నారుల ఆరోగ్యంపై వైద్యులను ఆరా తీయగా.. పాఠశాలలోని మరుగుదొడ్లను బ్లీచింగ్ పౌడర్తో పాటు ఇతర పదార్థాలతో శుభ్రం చేసినట్లు విద్యార్థులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా శిశు సంక్షేమశాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గీతారాణి పాఠశాలలో చదువుతున్న ఆరుగురు విద్యార్థులను ఏడాదిగా పాఠశాల మరుగుదొడ్డిని బ్లీచింగ్ పౌడర్, టెటల్, తదితర వాటితో శుభ్రం చేసేందుకు పురమాయించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు జరిపిన విచారణలో తేలింది. దీంతో ఆ ప్రధానోపాధ్యాయురాలు గీతారాణిని ఏడాది పాటు సస్పెండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు పెరుందురై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పెరుందురై పోలీసులు ప్రధానోపాధ్యాయురాలు గీతారాణిపై బాలల హక్కులు, రక్షణ చట్టం, అట్రాసిటీ నిరోధక చట్టం, ప్రమాదకర రసాయనాల అసురక్షిత వినియోగం సహా 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న గీతారాణిని పెరుందురై పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అనంతరం వారిని ఈరోడ్ మహిళా కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!