Principal Arrest : విద్యార్థులతో ఆ పని చేయిస్తున్న ప్రిన్సిపల్ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Principal Arrest : విద్యార్థులతో ఏడాదిగా టాయిలెట్లు శుభ్రం చేయిస్తున్న హెడ్ మాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని పాలక్కరై పంచాయతీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టాయిలెట్లను శుభ్రం చేసేందుకు షెడ్యూల్డ్ కులాల విద్యార్థులను తయారు చేసిన కేసులో పరారీలో ఉన్న ప్రధాన ఉపాధ్యాయురాలని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఈరోడ్ జిల్లా పెరుందురై సమీపంలోని బాలకరైలో ప్రభుత్వ పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాల ఉంది. మండలానికి చెందిన 35 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. ఈ పాఠశాలలో 2 మరుగుదొడ్లు ఉన్నాయి. ఒకటి ఉపాధ్యాయుల కోసం కాగా మరొకటి విద్యార్థులు ఉపయోగిస్తారు. ఈ క్రమంలో పాఠశాలలో చదువుతున్న కొందరు విద్యార్థులు అనారోగ్య సమస్యల కారణంగా కొంత కాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Read Also: Jabalpur: డ్రైవర్కు హార్ట్ ఎటాక్.. సిగ్నల్ దగ్గర వాహనాలపైకి దూసుకెళ్లిన బస్సు
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
చిన్నారుల ఆరోగ్యంపై వైద్యులను ఆరా తీయగా.. పాఠశాలలోని మరుగుదొడ్లను బ్లీచింగ్ పౌడర్తో పాటు ఇతర పదార్థాలతో శుభ్రం చేసినట్లు విద్యార్థులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా శిశు సంక్షేమశాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గీతారాణి పాఠశాలలో చదువుతున్న ఆరుగురు విద్యార్థులను ఏడాదిగా పాఠశాల మరుగుదొడ్డిని బ్లీచింగ్ పౌడర్, టెటల్, తదితర వాటితో శుభ్రం చేసేందుకు పురమాయించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు జరిపిన విచారణలో తేలింది. దీంతో ఆ ప్రధానోపాధ్యాయురాలు గీతారాణిని ఏడాది పాటు సస్పెండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు పెరుందురై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పెరుందురై పోలీసులు ప్రధానోపాధ్యాయురాలు గీతారాణిపై బాలల హక్కులు, రక్షణ చట్టం, అట్రాసిటీ నిరోధక చట్టం, ప్రమాదకర రసాయనాల అసురక్షిత వినియోగం సహా 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న గీతారాణిని పెరుందురై పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అనంతరం వారిని ఈరోడ్ మహిళా కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..