Haryana: నెల రోజుల శిశువు కడుపులో కవల పిండాలు.. చివరికీ….
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baby Born with Two Fetuses in Stomach: హర్యానాలోని నుహ్ జిల్లాలో ఒక ఆడ శిశువు చాలా అరుదైన వ్యాధితో జన్మించింది. మొదట్లో అంతా సాధారణంగానే అనిపించింది. కానీ కొన్ని వారాల తర్వాత ఆ శిశువు కడుపు ఉబ్బరం మొదలైంది. పాలు తాగడం లేదు. తరచుగా చిరాకు పడుతోంది. ఆ శిశువుకు ఒక నెల వయస్సు. దీంతో కుటుంబీకులు గురుగ్రామ్లోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రాథమిక పరీక్షలో బాలిక కడుపులో అసాధారణ వాపు తదితర సంకేతాలను వైద్యులు కనుగొన్నారు. ఆ తర్వాత స్కానింగ్ చేయించారు. స్కానింగ్లో రిపోర్టును చూసి వైద్యులు కూడా షాక్ అయ్యారు. వాస్తవానికి, ఆ నెల వయసున్న బాలిక కడుపులోని పొరలో 2 అసంపూర్ణ పిండాలు ఉన్నాయి.
READ MORE: Alekya chitti sisters : అవి బాగుండాలంటూ నీచంగా మాట్లాడారు.. రమ్య మోక్ష ఎమోషనల్
Also Read
- POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు.. ఆర్మీ కాల్పుల్లో 30 మంది బలి..
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
- India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
పిల్లల కడుపులో పిండాలు కనిపించే ఈ పరిస్థితిని ‘ఫీటస్ ఇన్ ఫీటు’ అంటారు. ఇది అరుదైన వైద్య పరిస్థితి. ఇది 5 లక్షల మంది పిల్లలలో ఒకరిలో మాత్రమే కనిపిస్తుంది. కానీ హర్యానా కేసు చాలా అరుదు.. ఎందుకంటే ఆ బాలిక కడుపులో ఒకటి కాదు రెండు అసంపూర్ణ పిండాలు ఉన్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సుమారు 200 కేసులు నమోదయ్యాయి. గతంలో భారత్లోనూ కొన్ని కేసులు రికార్డయ్యాయి. ఈ కేసులో ఆ శిశువు తల్లి మూడు పిండాలతో గర్భందాల్చింది. అందులో రెండు పిండాలు మూడో పిండం(శిశువు) ఉదరంలో పెరగడం ప్రారంభించాయి.
READ MORE: Kadapa Crime: కడపలో దారుణం: ఐదేళ్ల చిన్నారిపై హత్యాయత్నం
కాగా మొదట శిశువును ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు.. పోషకాహార లోపం తదితర సమస్యలు ఉన్నట్లు వైద్యులు అభిప్రాయపడ్డారు. కానీ పరీక్షలో పిండాలు ఉన్నట్లే తేలింది. వైద్యుల వివరణ ప్రకారం.. కడుపులోని పిండాలు శిశువు ప్రేగులు, కడుపుపై ఒత్తిడిని పెంచాయి. దీని కారణంగా శిశువుకు నొప్పి పెరిగింది. ఆకలి సైతం తగ్గింది. మొత్తానికి సర్జరీ చేసి ఈ పిండాలను తొలగించాలని వైద్యులు అభిప్రాయానికి వచ్చారు. శిశువు శరీరం శస్త్రచికిత్సకు సహకరించేందుకు మొదటగా IV ద్వారా పోషకాహారం, ద్రవాలను అందించారు. అనంతరం జూలై 30న, శిశువుకు విజయవంతంగా ఆపరేషన్ చేశారు. వైద్యుల బృందం బాలిక కడుపు నుంచి అసంపూర్ణ పిండాలు రెండింటినీ తొలగించింది. ఈ ప్రక్రియ చాలా క్లిష్టంగా మారినప్పటికీ విజయవతంగా ముగించారు.
తాజావార్తలు
-
SYG: రంగంలోకి దిగిన టాలెంటెడ్ బాలీవుడ్ స్టార్!
-
Peddi South Vs North: “దీపికా బికినీలు, మృణాల్ స్కిన్ షోలు మీకు ఓకేనా?”
-
Sunny Leone: అడ్డంగా బుక్కైన సన్నీలియోన్.. రంగంలోకి దిగిన సీఐడీ! అసలేం జరిగిందంటే..
-
POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు.. ఆర్మీ కాల్పుల్లో 30 మంది బలి..
-
Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!