Harish Rao : వడ్లు కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కుతున్నారు
- రేవంత్ రెడ్డి రైతులను రోడ్డున పడేశారు
- రాష్ట్రంలో వడ్లు కొనే దిక్కే లేదు
- పంటకు కనీసం మద్దతు ధర దక్కడం లేదు
- కొనుగోలు కేంద్రాలకు వడ్లు తెచ్చి నెలరోజులైనా కొనే నాథుడే లేడు
- బోనస్ ఇవ్వరు.. రైతు బంధు ఇవ్వరు : హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : సిద్దిపేట జిల్లా బద్దిపడగలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. వడ్లు కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కుతున్నారని, సీఎం రేవంత్ రెడ్డి రైతులను రోడ్డుపై పడేశాడని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని ఆయన ఆరోపించారు. ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడి వడ్లని 1800 కి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారని, మొక్కజొన్న కొనే నాధుడే లేడని హరీష్ రావు అన్నారు. వర్షాలకు చాలా చోట్ల తడిశాయి…వాటిని వెంటనే కొనుగోలు చేయాలని, ఒక్క రోజైన ధాన్యం కొనుగోళ్లపై రివ్యూ చేశారా అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. రైతుల కష్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతు బంధు 15 వేలు ఇస్తామని చెప్పి ఉన్న రైతుబంధు కూడా ఇవ్వలేదన్నారు. ఇంకా 22 లక్షల మందికి తెలంగాణలో రుణమాఫీ కాలేదని, రుణమాఫీపై ఎన్నో కొర్రీలు పెట్టి 100 కారణాలు చెబుతున్నారన్నారు హరీష్ రావు. రైతులకు రైతుబంధు ఇవ్వడానికి డబ్బులు లేవు అంటారని, లక్షా 50 వేల కోట్ల రూపాయలతో మూసి సుందరికరణ ఎలా చేస్తున్నారన్నారు. సీఎం రేవంత్, మంత్రులు ఇప్పటికైనా వడ్ల కొనుగోలు కేంద్రాల వద్దకి రావాలని, రైతుల సమస్యల్ని పట్టించుకోని పరిష్కరించాలని BRS డిమాండ్ చేస్తుందన్నారు హరీష్ రావు.
Delhi: ఘోరం.. ఇద్దరు ట్రాఫిక్ పోలీసులను ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్ (వీడియో)
Also Read
ఇదేకాకుండా..’ఆదిలాబాద్ లో సోయాబీన్ రైతులకు రెండు నెలలైన డబ్బులు ఇవ్వట్లేదు. సిద్దిపేటలో 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలి కానీ ఇప్పటివరకు 800 మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనలేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మాటలెక్కువ చేతలు తక్కువ. కరోనా ఉన్న, ఎంత కష్టం వచ్చినా మంత్రుల జీతాలు ఆపారు కానీ రైతుబంధు ఆపలేదు. పత్తి రైతులు ఆగమైపోయారు. గతేడాది కేసీఆర్ ఇప్పటివరకు ఎన్ని కొన్నాడో మీరిప్పుడు ఎన్ని కొన్నారో లెక్కలు చెప్పాలి. ధాన్యంపై కప్పుకోవడానికి టార్పాలిన్ కవర్లు ఇవ్వడం లేదు. ధాన్యం వెంటనే కొనుగోలు చేయకపోతే రోడ్డెకాల్సి వస్తుంది. రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదు.’ అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
Bhatti Vikramarka : భవిష్యత్తులో విద్యుత్కు ఇబ్బంది రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం
తాజావార్తలు
-
Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
-
Budhaditya Rajyog 2026: మిథునంలో సూర్యుడు.. 5 రాశుల వారికి రాజయోగాల జాక్పాట్.!
-
Dhanush – Siruthai Siva: “ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు”.. ఆ తెలుగు డైరెక్టర్కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
-
POK Protest: అసిమ్ మునీర్ ఒక టెర్రరిస్ట్.. పీఓకేలో తిరుగుబాటు..
-
Spicy Idli Chaat Recipe: మిగిలిన ఇడ్లీలతో సూపర్ స్పైసీ చాట్.. 5 నిమిషాల్లో రెడీ..!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!