Harish Rao : వడ్లు కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కుతున్నారు
- రేవంత్ రెడ్డి రైతులను రోడ్డున పడేశారు
- రాష్ట్రంలో వడ్లు కొనే దిక్కే లేదు
- పంటకు కనీసం మద్దతు ధర దక్కడం లేదు
- కొనుగోలు కేంద్రాలకు వడ్లు తెచ్చి నెలరోజులైనా కొనే నాథుడే లేడు
- బోనస్ ఇవ్వరు.. రైతు బంధు ఇవ్వరు : హరీష్ రావు
Harish Rao : సిద్దిపేట జిల్లా బద్దిపడగలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. వడ్లు కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కుతున్నారని, సీఎం రేవంత్ రెడ్డి రైతులను రోడ్డుపై పడేశాడని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని ఆయన ఆరోపించారు. ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడి వడ్లని 1800 కి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారని, మొక్కజొన్న కొనే నాధుడే లేడని హరీష్ రావు అన్నారు. వర్షాలకు చాలా చోట్ల తడిశాయి…వాటిని వెంటనే కొనుగోలు చేయాలని, ఒక్క రోజైన ధాన్యం కొనుగోళ్లపై రివ్యూ చేశారా అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. రైతుల కష్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతు బంధు 15 వేలు ఇస్తామని చెప్పి ఉన్న రైతుబంధు కూడా ఇవ్వలేదన్నారు. ఇంకా 22 లక్షల మందికి తెలంగాణలో రుణమాఫీ కాలేదని, రుణమాఫీపై ఎన్నో కొర్రీలు పెట్టి 100 కారణాలు చెబుతున్నారన్నారు హరీష్ రావు. రైతులకు రైతుబంధు ఇవ్వడానికి డబ్బులు లేవు అంటారని, లక్షా 50 వేల కోట్ల రూపాయలతో మూసి సుందరికరణ ఎలా చేస్తున్నారన్నారు. సీఎం రేవంత్, మంత్రులు ఇప్పటికైనా వడ్ల కొనుగోలు కేంద్రాల వద్దకి రావాలని, రైతుల సమస్యల్ని పట్టించుకోని పరిష్కరించాలని BRS డిమాండ్ చేస్తుందన్నారు హరీష్ రావు.
Delhi: ఘోరం.. ఇద్దరు ట్రాఫిక్ పోలీసులను ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్ (వీడియో)
Also Read
- Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
- Moringa Chutney Recipe: క్షణాల్లో కారం కారంగా మునగ చట్నీ తయారు చేయండి.. రుచితో పాటు పుష్కలమైన విటమిన్లు మీ సొంతం!
- Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
- Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
ఇదేకాకుండా..’ఆదిలాబాద్ లో సోయాబీన్ రైతులకు రెండు నెలలైన డబ్బులు ఇవ్వట్లేదు. సిద్దిపేటలో 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలి కానీ ఇప్పటివరకు 800 మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనలేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మాటలెక్కువ చేతలు తక్కువ. కరోనా ఉన్న, ఎంత కష్టం వచ్చినా మంత్రుల జీతాలు ఆపారు కానీ రైతుబంధు ఆపలేదు. పత్తి రైతులు ఆగమైపోయారు. గతేడాది కేసీఆర్ ఇప్పటివరకు ఎన్ని కొన్నాడో మీరిప్పుడు ఎన్ని కొన్నారో లెక్కలు చెప్పాలి. ధాన్యంపై కప్పుకోవడానికి టార్పాలిన్ కవర్లు ఇవ్వడం లేదు. ధాన్యం వెంటనే కొనుగోలు చేయకపోతే రోడ్డెకాల్సి వస్తుంది. రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదు.’ అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
Bhatti Vikramarka : భవిష్యత్తులో విద్యుత్కు ఇబ్బంది రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
-
Moringa Chutney Recipe: క్షణాల్లో కారం కారంగా మునగ చట్నీ తయారు చేయండి.. రుచితో పాటు పుష్కలమైన విటమిన్లు మీ సొంతం!
-
Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!