Site icon NTV Telugu

Harish Rao: మీరు రూ. కోటి ఇచ్చినట్లు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా.. సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్ రావు సవాల్

Harish Rao

Harish Rao

Harish Rao Challenges CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రేవంత్ కోటి రూపాయల పరిహారం ఇస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు. తాజాగా సంగారెడ్డి పర్యటనలో ఆయన ప్రసంగించారు. సిగాచి పరిశ్రమ ప్రమాదంలో 54 మంది చనిపోతే ఎవ్వరు పట్టించుకోలేదని.. ఘటన జరిగిన వెంటనే తాను వచ్చి పరిశీలిస్తే మర్నాడు సీఎం రేవంత్ వచ్చారని విమర్శించారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇస్తానని ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. కంపెనీ రూ.25 లక్షలు ఇచ్చింది కానీ.. రేవంత్ ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆరోపించారు. మనల్ని ద్రోహం చేసిన కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలి.. బీజేపీ కార్మికుల, పేదల వ్యతిరేక పార్టీ అని చెప్పారు. పంచాయతీ కార్యదర్శులు ఓ రోజు నా దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారని.. మీరే కేసీఆర్ ని ఓడగొట్టి ఇప్పుడు సమస్యల పరిష్కారం కోసం వస్తున్నారా? అని అడిగానన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు తమకు విలువ తెలియలేదు అన్నారని.. కేసీఆర్ లేని లోటు ఇప్పుడు అందరికి తెలుస్తుందన్నారు. మాటలు ఎవరు
చెబుతారు…? పనులు ఎవరు చేస్తారు? అన్నది గమనించి ఓటు వెయ్యాలని సూచించారు.

READ MORE: Union Minister Prahlad Joshi: తెలంగాణ ప్రజలపై మోడీకి ప్రేమ.. బడ్జెట్‌పై తప్పుడు ప్రచారం తగదు

సీఎం రేవంత్ పెన్షన్ 4 వేల రూపాయలు ఇస్తానని బాండ్ పేపర్ రాసి ఇస్తే ఇప్పటికి గతి లేదని.. కేసీఆర్ గెలిస్తే 4 వేల పెన్షన్ వచ్చేదని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. “కళ్యాణా లక్ష్మీకి కేసీఆర్ లక్షా 116 రూపాయలు ఇస్తే రేవంత్ తులం బంగారం అదనంగా ఇస్తానని అన్నారు.. రేవంత్ వచ్చాక కేసీఆర్ కిట్టు మాయమయ్యింది. ప్రభుత్వ ఆసుపత్రులలో వసతులు, మందులు లేవు.. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామన్నారు.. అరచేతిలో వైకుంఠం చూపించి మహిళలను మోసం చేశారు.. రేవంత్ రెడ్డి ఫ్రీ బస్సు పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు.. పురుషులకు మాత్రం బస్సుల్లో రేట్లు డబుల్ చేశారు.. ఇన్ని అబద్దపు హామీలు ఇచ్చినా కాంగ్రెస్‌కి మళ్ళీ ఓటయొద్దు.. రేవంత్ సీఎం అన్న విషయాన్ని మర్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నారు.. సీఎం మాట్లాడే భాషేనా అది? రేవంత్ కంటే పెద్ద వ్యక్తి, తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ని పట్టుకుని రా అని సంబోధిస్తున్నారు.. రేవంత్ ఇంకో రెండేళ్లు అయితే మళ్ళీ గెలవరు. రెండేళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతారు.. నేను మంత్రి అవుతా? మీ అందరికి కావాల్సిన పనులన్నీ చేస్తా.. ఈ రెండేళ్లలో ఇస్నాపూర్ లో గజం రోడ్డు వెయ్యలేదు, చిన్న డ్రైనేజీ కట్టలేదు.. కరోనా వస్తే మిమ్మల్ని కడుపులో పెట్టుకొని కేసీఆర్ కాపాడారు.. కాంగ్రెస్ నాయకులు వచ్చి డబ్బులు పంచితే తీసుకోండి.. ఓటు మాత్రం కారు గుర్తుకు ఓటేయండి.” అని హరీష్‌రావు వ్యాఖ్యానించారు.

READ MORE: Delhi Shocking: ప్రాణం తీసిన అధికారుల నిర్లక్ష్యం.. గుంతలో పడి యువకుడి మృతి

Exit mobile version