Harish Rao: కేసీఆర్ ఆరోగ్యంపై మాజీ మంత్రి హరీష్రావు కీలక ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: తెలంగాణ ప్రజలు మరో పోరాటానికి సిద్ధంకండి.. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం అందరం ఒక్కటై మరో పోరాటానికి సిద్ధం కావల్సిన పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన విజయ దీక్షా దివస్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు. కేసీఆర్ ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాడన్నారు. పాలు ఏందో నీళ్లు ఏందో ప్రజలకు అర్థమైంది.. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. కేసీఆర్ అంటే పోరాటం, కేసీఆర్ అంటే త్యాగం. కేసీఆర్ దీక్ష లేకపోతే తెలంగాణ ప్రకటన రాకపోయేదని తెలిపారు. కొందరు కాంగ్రెస్ నాయకులు మూర్ఖంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులు చరిత్ర రాస్తే.. రేవంత్ రెడ్డి చరిత్రనే రాయాల్సి వస్తుందని విమర్శించారు.. రేవంత్ రెడ్డి అంటే ద్రోహి, రేవంత్ రెడ్డి అంటే వెన్నుపోటు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే హక్కు రేవంత్ రెడ్డికి లేదని మండిపడ్డారు..
READ MORE: Google AI Glasses: డిస్ప్లే, వాయిస్ సపోర్ట్ తో.. రెండు AI గ్లాసెస్ ను విడుదల చేయనున్న గూగుల్
Also Read
- PM Modi Appeal: ప్రధాని మోడీ ప్రత్యేక విజ్ఞప్తి.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి..
- 200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
- Story Board: ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలవుతోందా..? మాంద్యం ముప్పు ఖాయమేనా..?
- 12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
రెండేళ్ల నుంచి తెలంగాణ అస్తిత్వాన్ని రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నారు.. రామోజీరావు కంటే గొప్ప అవార్డు లేదని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి.. రవీంద్రభారతిలో ఇచ్చే కాళోజీ, దాశరథి, గద్దర్ అవార్డులను అవమానిస్తున్నారని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. “టారిఫ్ లతో భారతదేశాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. సోనియా గాంధీని బలిదేవత అని మాట్లాడిన రేవంత్ రెడ్డి. ఈరోజు సోనియాగాంధీ దేవత అంటున్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను దెబ్బతీసేలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆనాడు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు యాదిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటే.. సమైక్య పాలకులు యాదిరెడ్డి శవాన్ని ఏపీ భవన్ కు రానివ్వలేదు.. ఢిల్లీ పోలీసులు మా మీద కేసులు పెడితే కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీ తిరగాల్సి వచ్చింది.. త్యాగం అంటే కేసీఆర్ ది.. పదవులను గడ్డి పూసల వదిలేసిన వ్యక్తి కేసీఆర్.. నిమ్స్ ఆస్పత్రిలో ప్రాణం మీదికి వచ్చిన దీక్ష విరమించని వ్యక్తి కేసీఆర్.. తెలంగాణ జైత్రయాత్రను కేసీఆర్ శవ యాత్రను అని నినదించినప్పుడు, నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.. తెలంగాణ చరిత్ర అంటే కేసీఆర్ ది. మనమందరం మరో పోరాటానికి సిద్ధం కావలి..” అని ప్రసంగించారు.
READ MORE: Benefits of Barley Water: డయాబెటిస్ నివారణకు బార్లీ ఎంతగా ఉపయోగపడుతుందో తెలుసా..
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar: మేము కాదు, వాళ్లే అసలు హీరోలు.. భువీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
PM Modi Appeal: ప్రధాని మోడీ ప్రత్యేక విజ్ఞప్తి.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
Allu Arjun Fans Association: కష్టాల్లో ఫ్యాన్ కుటుంబానికి అండగా AAFA.. రూ.1.5 లక్షల సహాయం!
-
Story Board: ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలవుతోందా..? మాంద్యం ముప్పు ఖాయమేనా..?
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!